Gold: 36 కిలోల బంగారం స్వాధీనం.. ముఠా అరెస్టు
ముంబయిలో 36 కేజీల బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు. 21 కోట్లు ఉంటుందని అంచనా.
ముంబయి: బంగారం స్మగ్లింగ్ ముఠాను ముంబయిలోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) చాకచక్యంగా పట్టుకుంది. వారి నుంచి 36 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.21 కోట్లు ఉంటుందని అంచనా. డీఆర్ఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇటీవల కాలంలో ఎయిర్పోర్టు, ఎయిర్కార్గో ద్వారా అక్రమంగా బంగారాన్ని తీసుకురావడం ఎక్కువైంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు డీఆర్ఐ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ముంబయి విమానాశ్రయంలో చోటు చేసుకున్న అక్రమబంగారం రవాణా కేసులపై ఈ ప్రత్యేక బృందం దర్యాప్తు జరుపుతోంది. ఈ క్రమంలో వివిధ చోట్ల సోదాలు నిర్వహించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఓ పెద్ద ముఠా అక్రమంగా బంగారాన్ని స్వదేశానికి తీసుకొచ్చి హవాలా మార్గంలో విక్రయిస్తున్నట్లు తేలింది. ఈ వ్యవహారం వెనుక విదేశీయుల హస్తం కూడా ఉందని అధికారులు చెబుతున్నారు.
విదేశాల నుంచి వస్తున్న వ్యక్తులకు డబ్బు ఆశ చూపి వారి ద్వారా ఈ ముఠా అక్రమంగా బంగారాన్ని సేకరిస్తుంది. క్యాప్సిల్స్, వివిధ రూపాల్లో భారత్కు చేరిన బంగారాన్ని ఈ ముఠా మళ్లీ ప్రాసెస్ చేస్తుంది. వీటిని బిస్కెట్ల రూపంలో తయారు చేసి, అక్రమంగా విక్రయిస్తుంది. ఈ మొత్తం వ్యవహారంపై పక్కా సమాచారం ఉన్న డీఆర్ఐ ప్రత్యేక బృందం సోమవారం సోదాలు నిర్వహించింది. వివిధ ప్రాసెసింగ్ దశల్లో ఉన్న 36 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. అంతేకాకుండా రూ.20 లక్షలకు పైగా నగదును కూడా ముఠా నుంచి స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్ఐ వెల్లడించింది. ఈ ముఠా వెనుక ఇంకెవరెవరు ఉన్నారన్న దానిపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM