Andhra News: అరకులో పర్యాటక బస్సు దగ్ధం.. సందర్శకులు సురక్షితం

అరకు ఘాటు రోడ్డులో ఘోర ప్రమాదం తప్పింది. విజయనగరం జిల్లా చిల్లూరు గ్రామానికి చెందిన 24 మంది పర్యాటకులు అరకులోయ సందర్శన అనంతరం తిరిగి వెళ్తుండగా బస్సుకు షార్ట్‌ సర్క్యూట్‌ అయ్యి బస్సు పూర్తిగా దగ్ధమైంది.

Published : 27 Nov 2022 22:40 IST

అరకులోయ పట్టణం: అరకు ఘాటు రోడ్డులో ఘోర ప్రమాదం తప్పింది. విజయనగరం జిల్లా చిల్లూరు గ్రామానికి చెందిన 24 మంది పర్యాటకులు అరకులోయ సందర్శన అనంతరం తిరిగి వెళ్తుండగా.. టైడా సమీపంలో బస్సుకు షార్ట్‌ సర్క్యూట్‌ అయ్యింది. అప్రమత్తమైన డ్రైవర్‌ బస్సును రోడ్డు పక్కన ఆపేసి, పర్యాటకులను అలర్ట్‌ చేశాడు. దీంతో వారంతా బస్సులోంచి బయటకు వచ్చేశారు. అనంతరం క్షణాల్లో మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని