హైదరాబాద్‌-విజయవాడ హైవేపై ట్రాఫిక్‌ జామ్‌

యాదాద్రి జిల్లా దండు మల్కాపూర్‌ వద్ద విజయవాడ- హైదరాబాద్‌ జాతీయ

Updated : 19 Jul 2021 14:00 IST

ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి.. 
గ్రామస్థుల ఆందోళనతో నిలిచిపోయిన వాహనాలు

దండుమల్కాపూర్‌: యాదాద్రి జిల్లా దండు మల్కాపూర్‌ వద్ద విజయవాడ- హైదరాబాద్‌ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కరోనా టీకా కోసం వెళుతున్న యాదమ్మ(70) అనే వృద్ధురాలిని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. వృద్ధురాలి మృతిని నిరసిస్తూ గ్రామస్థులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. మృతదేహంతో రాస్తారోకో నిర్వహించారు. అండర్‌పాస్‌ బ్రిడ్జి లేని కారణంగా ప్రమాదం జరిగినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రహదారిపై ఆందోళనతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఇరువైపులా దాదాపు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆందోళనకారులతో చౌటుప్పల్‌ ఏసీపీ శంకర్‌ మాట్లాడారు. పోలీసులు హామీతో గ్రామస్థులు ఆందోళన విరమించారు. అనంతరం వాహనాలు నెమ్మదిగా కదిలాయి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని