Rangareddy: రంగారెడ్డిలో విషాదం.. చెరువులో మునిగి నలుగురు పిల్లలు మృతి

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాడిపర్తిలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పిల్లలు చెరువులో మునిగి మృతి చెందారు.

Updated : 02 Oct 2022 17:27 IST

తాడిపర్తి: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాడిపర్తిలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లి నలుగురు పిల్లలు దుర్మరణం చెందారు. మృతులను తాడిపర్తికి చెందిన అబ్దుల్‌ రహీం కుటుంబసభ్యులు ఖలీద్‌(12), రేహాన్‌(10), ఇమ్రాన్‌(09), సమ్రీన్‌(14)గా గుర్తించారు. దసరా సెలవులు కావడంతో పిల్లలు సరదాగా ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబంలోని నలుగురు పిల్లలు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విగతజీవులుగా పడి ఉన్న చిన్నారులను చూసి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్న దృశ్యాలు అందర్నీ కంటతడి పెట్టించాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు