Tripura Teen: నలుగురు కుటుంబ సభ్యులను నరికి చంపిన మైనర్!
త్రిపుర(Tripura)లో దారుణం చోటుచేసుకుంది. ఓ 17 ఏళ్ల బాలుడు తన నలుగురు కుటుంబ సభ్యులను గొడ్డలితో నరికి చంపాడు. వారంతా నిద్రలో ఉండగా ఈ ఘాతుకానికి పాల్పడటం గమనార్హం.
అగర్తలా: త్రిపుర(Tripura)లో దారుణం చోటుచేసుకుంది. ఓ 17 ఏళ్ల బాలుడు తన నలుగురు కుటుంబ సభ్యులను గొడ్డలితో నరికి చంపాడు. వారంతా నిద్రలో ఉండగా ఈ ఘాతుకానికి పాల్పడటం గమనార్హం. పోలీసుల వివరాల ప్రకారం.. ఇక్కడి ధలాయ్(Dhalai) జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో శనివారం రాత్రి ఓ బాలుడు.. ఇంట్లో నిద్రపోతున్న తన తల్లి, చెల్లి, తాత, అత్తమ్మను గొడ్డలితో నరికి హత్య చేశాడు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. కొద్దిసేపటికి అతని తండ్రి ఇంటికి వచ్చి చూడగా.. ఎక్కడికక్కడ నెత్తుటి మరకలు కనిపించాయి. నలుగురి మృతదేహాలను బావిలో పడేసినట్లు గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే, ఆదివారం ఉదయం ఇంటి సమీపంలోని మార్కెట్లో నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, హత్యలకు గల కారణాలు తెలుసుకునే దిశగా దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. అతను టీవీకి అలవాటు పడ్డాడని, ముఖ్యంగా నేరాల ఆధారిత కార్యక్రమాలు ఎక్కువగా చూసేవాడని స్థానికులు తెలిపారు. నిందితుడు గతంలో ఓసారి తన ఇంట్లోనే చోరీకి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను హతమార్చే సమయంలో.. వారి అరుపులు బయటకు వినిపించకుండా ఉండేందుకుగానూ పెద్ద సౌండ్తో మ్యూజిక్ను ప్లే చేశాడని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
-
ఈ పోలింగ్ ఏజెంట్ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
-
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
-
కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ
-
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు