Tripura Teen: నలుగురు కుటుంబ సభ్యులను నరికి చంపిన మైనర్‌!

త్రిపుర(Tripura)లో దారుణం చోటుచేసుకుంది. ఓ 17 ఏళ్ల బాలుడు తన నలుగురు కుటుంబ సభ్యులను గొడ్డలితో నరికి చంపాడు. వారంతా నిద్రలో ఉండగా ఈ ఘాతుకానికి పాల్పడటం గమనార్హం.

Published : 07 Nov 2022 01:51 IST

అగర్తలా: త్రిపుర(Tripura)లో దారుణం చోటుచేసుకుంది. ఓ 17 ఏళ్ల బాలుడు తన నలుగురు కుటుంబ సభ్యులను గొడ్డలితో నరికి చంపాడు. వారంతా నిద్రలో ఉండగా ఈ ఘాతుకానికి పాల్పడటం గమనార్హం. పోలీసుల వివరాల ప్రకారం.. ఇక్కడి ధలాయ్‌(Dhalai) జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో శనివారం రాత్రి ఓ బాలుడు.. ఇంట్లో నిద్రపోతున్న తన తల్లి, చెల్లి, తాత, అత్తమ్మను గొడ్డలితో నరికి హత్య చేశాడు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. కొద్దిసేపటికి అతని తండ్రి ఇంటికి వచ్చి చూడగా.. ఎక్కడికక్కడ నెత్తుటి మరకలు కనిపించాయి. నలుగురి మృతదేహాలను బావిలో పడేసినట్లు గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే, ఆదివారం ఉదయం ఇంటి సమీపంలోని మార్కెట్‌లో నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, హత్యలకు గల కారణాలు తెలుసుకునే దిశగా దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. అతను టీవీకి అలవాటు పడ్డాడని, ముఖ్యంగా నేరాల ఆధారిత కార్యక్రమాలు ఎక్కువగా చూసేవాడని స్థానికులు తెలిపారు. నిందితుడు గతంలో ఓసారి తన ఇంట్లోనే చోరీకి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను హతమార్చే సమయంలో.. వారి అరుపులు బయటకు వినిపించకుండా ఉండేందుకుగానూ పెద్ద సౌండ్‌తో మ్యూజిక్‌ను ప్లే చేశాడని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని