నిమిషాల వ్యవధిలో ఇద్దరు ఆటోడ్రైవర్లు మృతి

హైదరాబాద్‌ నారాయణగూడ పరిధిలో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆటో డ్రైవర్లు నిమిషాల వ్యవధిలో ఒక్కసారిగా కూప్పకూలి మృతి చెందారు.

Published : 06 Feb 2021 01:47 IST

హైదరాబాద్‌ నారాయణగూడలో ఘటన

నారాయణగూడ: హైదరాబాద్‌ నారాయణగూడ పరిధిలో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆటో డ్రైవర్లు నిమిషాల వ్యవధిలో ఒక్కసారిగా కూప్పకూలి మృతి చెందారు. కర్మన్‌ఘాట్‌కు చెందిన ఆంజనేయులు (45) శుక్రవారం తన ఆటోలో కాచిగూడ నుంచి నారాయణగూడ వైఎంసీఏ వైపు వస్తున్నాడు. నారాయణగూడ మెట్రో స్టేషన్‌ వద్దకు రాగానే ఆటో ఒక్కసారిగా ఆగడమే కాకుండా ఆంజనేయులు అందులోంచి కింద పడ్డాడు. ఈ క్రమంలో తల ఫుట్‌పాత్‌కు తగలడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మూర్చ రావడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసుల ప్రాథమిక అంచనాకు వచ్చారు. 

మరోవైపు ఈ కేసు విచారిస్తుండగానే వైఎంసీఏ మైదానంలో మరో ఆటో డ్రైవర్‌ ఉన్నట్టుండి కిందపడి మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం అందింది. మృతుడు యూపీకి చెందిన రాజేందర్‌(43)గా నిర్ధారించారు. చిక్కడపల్లిలో నివాసముంటూ ఆటో నడుపుకొంటున్నట్లు తెలిసింది. ఈ ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నారాయణగూడ పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి..

జ్యూస్‌లో నిద్రమాత్రలు కలిపి భార్యను చంపేశాడు!
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని