Boat Accident: బ్రహ్మపుత్ర నదిలో విషాదం.. 100 మందితో వెళ్తున్న రెండు పడవలు ఢీ!
అసోంలోని బ్రహ్మపుత్ర నదిలో విషాద ఘటన చోటుచేసుకుంది. జోర్హాత్లో నిమతి ఘాట్ వద్ద రెండు ప్రయాణికుల ......
గువాహటి: అసోంలోని బ్రహ్మపుత్ర నదిలో పెను విషాదం చోటుచేసుకుంది. జోర్హాత్లో నిమతి ఘాట్ వద్ద రెండు ప్రయాణికుల పడవలు పరస్పరం ఢీకొన్నాయి. ప్రమాదం సమయంలో ఈ పడవల్లో మొత్తంగా 120 మంది ప్రయాణికులు ఉన్నట్టు అదికారులు గుర్తించారు. ఇప్పటివరకు 50 మందిని రక్షించగా.. గల్లంతైన మిగతా 70మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో ఎంతమంది మరణించిందీ ఇప్పుడే చెప్పలేమని అధికారులు చెబుతున్నారు. అసోం రాజధాని గువాహటికి 350 కి.మీల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన పడవల్లో ఒకటి మజులి నుంచి నిమతి ఘాట్కు వస్తుండగా.. ఇంకో పడవ ఎదురుగా వెళ్తుండగా ఒకదానినొకటి పరస్పరం ఢీకొట్టాయి.
ప్రమాదానికి కారణమదేనా?
ఈ ప్రమాదంలో చిక్కుకున్న కొందరు ప్రయాణికులు నీళ్లలోకి దూకి తమను తాము రక్షించుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్టు వీడియోల్లో రికార్డయింది. మరోవైపు, ఈ ప్రమాదంలో ప్రయాణికుల లగేజీతో ఉన్న మోటార్ బైకులు, కార్లు సైతం కొట్టుకుపోయాయి. ఘటనా స్థలానికి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకొని సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. ఈ ప్రమాదానికి కారణం పడవల్లో కార్లు, బైక్లు ఉండటం వల్లేనని అధికారులు భావిస్తున్నారు.
సహాయక చర్యలకు సీఎం ఆదేశం..
ఈ ఘటనపై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ విషాదం తననెంతగానో బాధించిందని ట్వీట్ చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సహకారంతో సహాయక చర్యలు చేపట్టాలని మజులి, జోర్హాత్ జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీచేశారు. మంత్రి బిమల్ బోరాను తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. ఘటనా స్థలాన్ని గురువారం తాను సందర్శిస్తానని వెల్లడించారు. అక్కడి పరిణామాలను సీఎం ముఖ్యకార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా సమీక్షిస్తున్నారు.
ప్రధాని విచారం..
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తంచేశారు. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడాలని ప్రార్థించారు. గల్లంతైనవారిని రక్షించేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
చైనాకు చెందిన ఓ మహిళ(31) అగ్నిపర్వతం అంచున ఫొటో తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు అందులో పడి మరణించిన ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. -
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. -
సస్పెన్షన్కు గురైన సబ్రిజిస్ట్రార్ ఇంట్లో అనిశా తనిఖీలు.. రూ. 10 కోట్ల ఆస్తుల గుర్తింపు
మహబూబాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గత నెల 22న లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కిన సబ్రిజిస్ట్రార్ తస్లీమ మహ్మద్ ఇంట్లో అధికారులు సోమవారం మరోసారి తనిఖీలు నిర్వహించారు. -
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం.. 20 కార్లు దగ్ధం!
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి గణపతి కాంప్లెక్స్లో సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే చోట ఈ ఘటన చోటుచేసుకుంది. -
చదువుపై మక్కువతో నవ వధువు బలవన్మరణం
ఉన్నత చదువులు చదువుకుంటానని చెప్పినా కుటుంబసభ్యులు వివాహం చేయడంతో నవ వధువు పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం మంగయ్యబంజర్ గ్రామంలో చోటుచేసుకుంది. -
మహిళపై అమానుషానికి పాల్పడింది సంగారెడ్డి యువకులు!
మహిళపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడి ఆమె మృతికి కారణమైన కేసులో పోలీసులు నిందితులను గుర్తించినట్లు తెలిసింది. -
ఏపీలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వైకాపా నాయకుడి అరెస్టు
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వైకాపా నాయకుడు బోయ మహానందిని మూడో పట్టణ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. -
మంచులో కూరుకుపోయి తెలుగు వైద్య విద్యార్థి మృతి
వైద్య విద్య కోసం కిర్గిజ్స్థాన్ వెళ్లిన తెలుగు విద్యార్థి అక్కడి జలపాతం సందర్శనకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఈ విషాదకర ఘటన ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. -
మూడు పదులు నిండకుండానే ముగిసిన జీవితాలు
పట్టుమని 30 ఏళ్లు కూడా నిండలేదు.. రెండేళ్ల కిందటే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటూ.. ఆనందంగా జీవిస్తున్న ఆ దంపతుల ఆశలు అర్ధంతరంగా ఆవిరైపోయాయి. -
పంట నష్టాలతో రైతు ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా మరిపెడ శివారు మాకుల తండాలో ఇస్లావత్ చీనా(42) అనే రైతు సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయంలో నష్టం, ఆర్థిక సమస్యలతో బలవన్మరణానికి పాల్పడ్డారు. -
రాళ్లు విసిరి.. జెండా కర్రలతో కొట్టి
తెదేపా ఎస్సీ కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. సత్తెనపల్లి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సోమవారం నామినేషన్ వేశారు. -
పల్నాడు జిల్లాలో తెదేపా కార్యాలయానికి నిప్పు
పల్నాడు జిల్లాలో వైకాపా నాయకులు ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం రాత్రి బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలంలో తెదేపా కార్యాలయం వద్ద తాటాకు పందిరికి నిప్పు పెట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా