GHMC: మ్యాన్‌హోల్‌లోకి దిగి ఇద్దరి గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం

ఎల్బీనగర్‌ పరిధిలోని సాహెబ్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. డ్రైనేజ్‌ క్లీనింగ్‌ కోసం మ్యాన్‌హోల్‌లోకి దిగి ఇద్దరు జీహెచ్‌ఎంసీ కార్మికులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్‌,  

Updated : 04 Aug 2021 12:14 IST

హైదరాబాద్‌: ఎల్బీనగర్‌ పరిధిలోని సాహెబ్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. డ్రైనేజ్‌ క్లీనింగ్‌ కోసం మ్యాన్‌హోల్‌లోకి దిగి ఇద్దరు జీహెచ్‌ఎంసీ కార్మికులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్‌, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మ్యాన్‌హోల్‌ నుంచి ఒకరి మృతదేహాన్ని వెలుపలికి తీశారు. గల్లంతైన కార్మికులు అంతయ్య, శివగా గుర్తించారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని