లారీ ఢీకొని ఇద్దరి దుర్మరణం

ఇసుక లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలైన ఘటన బుధవారం రాత్రి  మేడ్చల్‌ జిల్లా షామిర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

Updated : 11 Feb 2021 01:37 IST

షామీర్‌పేట్‌: ఇసుక లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలైన ఘటన బుధవారం రాత్రి మేడ్చల్‌ జిల్లా షామిర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. షామీర్‌పేట్‌ ఎస్సై గణేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం..  రాజీవ్‌ రహదారి మీదుగా  సిద్దిపేట జిల్లా ములుగు మండలం అచ్చయ్యపల్లి కి చెందిన నర్సింహ(35) మారేడు మల్లేశ్‌(25) ద్విచక్రవాహనంపై తమ స్వగ్రామానికి వెళ్తున్నారు. షామీర్‌పేట మండలం తుర్కపల్లి గ్రామ పరిధిలోని క్లాసిక్‌ దాబా వద్దకు రాగానే వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఇసుక లారీ వారి వాహనాన్ని ఢీకొంది. లారీ వారిపైనుంచి వెళ్లడంతో శరీర భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని ఎస్సై తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని