
TS News: పోలీసుల కాల్పుల్లో నలుగురుమావోయిస్టుల మృతి
ములుగు: ములుగు జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఈ ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. వెంకటాపురం మండలం కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల కాల్పుల్లో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. కానిస్టేబుల్ను హెలికాఫ్టర్లో అధికారులు హనుమకొండ తరలించారు. మావోయిస్టులు తమకు తారసపడటంతో కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. కర్రెగుట్ట అటవీప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.