Crime news: యువతిపై దారుణం.. కిడ్నాప్‌ చేసి 15రోజుల పాటు అఘాయిత్యం!

18 ఏళ్ల యువతిని కిడ్నాప్‌ చేసి అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. యూపీలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..

Updated : 13 Dec 2022 07:14 IST

బల్లియా: 18 ఏళ్ల యువతిపై దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు ఆమెను కిడ్నాప్‌ చేసి వేరే రాష్ట్రానికి తీసుకెళ్లి దాదాపు రెండు వారాల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన యూపీలోని బల్లియాలో గర్హ్వార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగులోకి వచ్చింది. యువతిపై దారుణానికి పాల్పడిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 18 నుంచి 20ఏళ్ల వయసు ఉన్న బింద్, కుమార్ అనే యువకులు నవంబర్‌ 11న యువతిని కిడ్నాప్‌ చేసినట్టు గర్హ్వార్‌ పోలీస్‌స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ రాజ్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. నవంబర్‌ 20న యువతి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తీవ్రంగా గాలించి 26న బిహార్‌లో యువతిని రక్షించినట్టు వెల్లడించారు. నిందితులను ఆదివారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్టు తెలిపారు. కోర్టులో యువతి తన వాంగ్మూలం ఇచ్చిందని.. తనకు మత్తు మందు ఇచ్చి అపహరించుకుపోయారని వాపోయిందన్నారు. బిహార్‌లో ఓ హోటల్‌కు తీసుకెళ్లి 15 రోజుల పాటు తనపై అత్యాచారం చేశారని యువతి కోర్టుకు తెలిపినట్టు సదరు అధికారి మీడియాకు వివరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని