కశ్మీర్‌లో ఇద్దరు ముష్కరుల హతం!

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. దక్షిణ కశ్మీర్‌లోని హక్రిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సీఆర్పీఎఫ్‌, ఆర్మీ దళాలకు సమాచారం అందడంతో ప్రత్యేక ఆపరేషన్‌ బృందాన్ని....

Published : 21 Oct 2020 01:23 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. దక్షిణ కశ్మీర్‌లోని హక్రిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సీఆర్పీఎఫ్‌, ఆర్మీ దళాలకు సమాచారం అందడంతో ప్రత్యేక ఆపరేషన్‌ బృందాన్ని మంగళవారం రంగంలోకి దింపాయి. ఆపరేషన్‌లో భాగంగా వారు ఉగ్రవాదులు ఉన్న హక్రిపొరా గ్రామాన్ని చుట్టుముట్టారు. దీంతో ఉగ్రమూకలు భద్రతాదళాలపైకి కాల్పులకు తెగబడ్డాయి. వెంటనే సైనికులు అప్రమత్తమై ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టారు. కాగా హతమైన ఉగ్రవాదుల గుర్తింపును అధికారులు నిర్ధరించాల్సి ఉంది. సోమవారం సాయంత్రం కూడా షోపియాన్‌ జిల్లాలో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని