రెండు రైళ్లు ఢీకొని.. ఈజిప్ట్‌లో 32మంది మృతి! 

ఈజిప్ట్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ కైరోకి సమీపంలో రెండు పాసింజర్‌ రైళ్లు పరస్పరం ఢీకొట్టడంతో .....

Updated : 27 Mar 2021 07:44 IST

కైరో: ఈజిప్ట్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ కైరోకి సమీపంలో రెండు పాసింజర్‌ రైళ్లు పరస్పరం ఢీకొట్టడంతో 32మంది మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదంలో 66మందికి గాయాలైనట్టు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దక్షిణ కైరోకు 460 కి.మీల దూరంలోని షోహాగ్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రెండు రైళ్లు ఢీకొట్టడంతో నాలుగు బోగీలు బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఘటనా స్థలానికి 36 అంబులెన్స్‌లు చేరుకున్నట్టు ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి డాక్టర్‌ ఖలీద్‌ మెజాహెద్‌ వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు చెప్పారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని