Drugs: పోలీసుల ప్రత్యేక తనిఖీలు.. ఇద్దరు డ్రగ్స్ స్మగ్లర్ల అరెస్టు
నూతన సంవత్సర వేడుకల రోజున పోలీసులు జరిపిప ప్రత్యేక తనిఖీల్లో ఇద్దరు డ్రగ్స్ కేసుతో సంబంధమున్న ఇద్దరు పాత నేరస్తులు పట్టుబడ్డారు. వారి నుంచి 3 గ్రాముల కొకైన్, రెండు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పోలీసులు (police) నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో డ్రగ్స్ (Drugs) కేసులో పాత నేరస్థులు పట్టుబడ్డారు. రాంగోపాల్ పేట్లో నవంబర్ 3న నమోదైన కేసులో మోహిత్ అగర్వాల్, మన్యం కృష్ణ కిషోర్ రెడ్డి నిందితులు. కేసు నమోదైనప్పటి నుంచి వాళ్లిద్దరూ పరారీలో ఉన్నారు. తాజాగా హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులతో కలిసి రాంగోపాల్ పేట్ పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. వారి నుంచి 3 గ్రాముల కొకైన్, రెండు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.
ఇంటర్నేషనల్ డీజే ఈవెంట్లు నిర్వహిస్తున్న మోహిత్ అగర్వాల్.. ముంబయి, గోవా, హైదరాబాద్, బెంగళూరులో పార్టీలు నిర్వహిస్తుంటాడు. హైదరాబాద్లోని పబ్లలో సైతం ప్రైవేట్ పార్టీలు నిర్వహిస్తున్నాడు. పార్టీలు నిర్వహిస్తూ కొకైన్కు బానిసగా మారిన మోహిత్ పలువురికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్లో కీలక నిందితుడు ఎడ్విన్తో కూడా మోహిత్కు సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. మరో నిందితుడు హైదరాబాద్లో కేఎంసీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను నడుపుతున్న మన్యం కృష్ణ కిషోర్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. తరచూ పబ్బుల్లో స్నేహితులకు పార్టీల ఇస్తున్న కిషోర్.. డ్రగ్స్కు బానిసయ్యాడని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ సేవించేందుకు తరచూ గోవా వెళ్లి వస్తుంటాడని చెప్పారు. ఎడ్విన్తో కూడా పరిచయాలు ఉన్నాయన్నారు. అతనితోపాటు బెంగళూరులోని మరో వ్యక్తితో కిషోర్కు పరిచయం ఏర్పడింది. బెంగళూరు నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ను ఆ వ్యక్తి బస్సుల్లో పంపుతుండగా.. అతనికి కృష్ణ కిషోర్ గూగూల్ పే ద్వారా డబ్బులను పంపి డ్రగ్స్ తీసుకుంటున్నాడని పోలీసులు వివరించారు. నిన్న బంజారాహిల్స్ రోడ్ నం.3 లోని అతని నివాసంలో కృష్ణ కిషోర్ రెడ్డిని అరెస్ట్ చేసి.. 2గ్రాములు కొకైన్ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కాగా నిందితుడు మోహిత్ అగర్వాల్ భార్య సినీ నటి నేహదేశ్ పాండే. అమె పలు తెలుగు సినిమాల్లో నటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
అన్నమయ్య జిల్లా రాయచోటిలోని వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో లిఫ్ట్ తెగిపడి 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. -
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
Crime News: తమ పొరుగునే ఉంటున్న వ్యక్తి చేతిలో ఓ యువతి లైంగిక దోపిడీకి గురైంది. శారీరకంగా హింస అనుభవించింది. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పన్న కల్యాణం.. జగమంతా పరవశం
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!