Selfie: రైలు పట్టాలపై సెల్ఫీలు.. ఇంతలోనే దూసుకొచ్చిన లోకల్‌ ట్రైన్‌!

సెల్ఫీ మోజులో పడి అనేకమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తమకు నచ్చిన ప్రదేశంలో ప్రమాదకరంగా సెల్ఫీలు దిగుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు నేటి యువతరం.

Published : 09 Nov 2022 01:07 IST

హావ్‌డా: సెల్ఫీ మోజులో పడి అనేకమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తమకు నచ్చిన ప్రదేశంలో ప్రమాదకరంగా సెల్ఫీలు దిగుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు నేటి యువతరం. తాజాగా అలాంటి ఘటనే హావ్‌డాలో చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్‌పై ప్రమాదకర రీతిలో సెల్ఫీ తీసుకుంటుండగా ఇద్దరు యువకులపైకి లోకల్‌ రైలు దూసుకొచ్చింది. దీంతో వారిద్దరూ అక్కడిక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్‌లోని హావ్‌డా జిల్లాలో సోమవారం రాత్రి చోటుచేసుకున్నట్టు జీఆర్‌పీ పోలీసులు వెల్లడించారు. సోమవారం రాత్రి కుల్గాచియా- బగ్నాన్‌ రైల్వేస్టేషన్ల మధ్య మహిష్‌రేఖ వంతెన సమీపంలో ఈ దుర్ఘటన జరిగిందని తెలిపారు. మృతులను బగ్నాన్‌ ప్రాంతానికి చెందిన షరీఫ్ అలీ ముల్లిక్‌ (18), షరిఫుల్‌ ముల్లిక్‌ (14)గా గుర్తించినట్టు తెలిపారు. యువకుల మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని