Amaravati: కృష్ణా నదిలో ఈతకు దిగిన ఇద్దరు యువకులు మృతి

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం డోలాస్‌ నగర్‌కు చెందిన ఇద్దరు యువకులు కృష్ణానదిలో ఈతకు దిగి మృతి చెందారు.

Published : 26 May 2023 22:16 IST

తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం డోలాస్‌ నగర్‌కు చెందిన ఇద్దరు యువకులు కృష్ణానదిలో ఈతకు దిగి మృతి చెందారు. శుక్రవారం డోలాస్‌ నగర్‌కు చెందిన ఆరుగురు యువకులు సీతానగరం వద్ద కృష్ణానదిలో స్నానానికి దిగారు. వీరిలో నలుగురు యువకులు బయటకు రాగా, మిగిలిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గజ ఈతగాళ్ల సాయంతో డేరంగుల కృష్ణయ్య, శివశంకర్‌ మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు. యువకుల మృతదేహాలను చూసిన వారి కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలముకున్నాయి. ఈత రాకపోవడం వల్లే యువకులు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని