Crime News: మచిలీపట్నంలో దారుణం.. తండ్రి స్థానంలో ఉండి బాలికపై అత్యాచారం

మచిలీపట్నంలో దారుణం చోటు చేసుకుంది. బాలికపై అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Updated : 30 Apr 2022 12:11 IST

మచిలీపట్నం క్రైమ్‌: మచిలీపట్నంలో దారుణం చోటు చేసుకుంది. బాలికపై అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తల్లితో సహజీవనం చేస్తూనే ఆమె కుమార్తెపై ఘాతుకానికి పాల్పడ్డాడు. పది నెలలుగా బాలికపై తండ్రి స్థానంలోని వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక గర్భం దాల్చడంతో బంధువులు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రభుత్వాసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనకు సంబంధించి చిలకలపూడి పోలీసులు నిందితుడు సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు టాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని