Crime news: పెళ్లికి పిలవలేదని ఇంటిపై రాళ్లదాడి.. ప్రతి దాడిలో వ్యక్తి మృతి..

పెళ్లికి పిలవలేదన్న కోపంతో  పెళ్లి కొడుకు ఇంటిపై రాళ్లేసిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది.

Published : 03 Mar 2023 01:55 IST

కొట్టాయం: చిన్న చిన్న విషయాలే ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తుంటాయి. పెళ్లికి పిలవలేదన్న అక్కసుతో పెళ్లి కొడుకు ఇంటిపై రాళ్లు విసిరి ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ షాకింగ్‌ ఘటన కేరళ(Kerala)లోని కొట్టాయం జిల్లా కరుకచల్‌లో చోటుచేసుకుంది. స్థానిక మీడియాలో కథనం ప్రకారం.. సెబాస్టియన్‌ అనే యువకుడికి ఇటీవల పెళ్లయింది. అయితే, ఈ పెళ్లి వేడుకకు పొరుగునే ఉండే బిను(36) అనే యువకుడిని ఆహ్వానించకపోవడంతో దాన్ని అతడు తీవ్ర అవమానంగా భావించాడు. ఆ ఆక్కసుతో పెళ్లి కొడుకు ఇంటిపై రాళ్లు విసిరాడు. దీంతో బినుపై ఆగ్రహంతో సెబాస్టియన్‌ మరో వ్యక్తి విష్ణుతో కలిసి అతడిపై దాడికి దిగాడు. బినూతో విష్ణుకు అంతకుముందు నుంచే వైరం ఉండటంతో అతడిని సంప్రదించిన సెబాస్టియన్‌.. ఆదివారం రాత్రి పదునైన ఆయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బినూను ఆస్పత్రికి తరలించడంతో చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత నిందితులిద్దరూ ఆయుధాలతోనే స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయినట్టు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని