Sangareddy: బీరు సీసాతో గొంతుకోసి చంపేశారు!

సంగారెడ్డి జిల్లా కోహిర్‌ మండలంలో దారుణం జరిగింది. మాచిరెడ్డిపల్లిలో గుర్తుతెలియని వ్యక్తులు బీరు సీసాతో యువకుడి గొంతుకోసి హత్య చేశారు.

Updated : 21 May 2023 11:57 IST

కోహిర్‌: సంగారెడ్డి జిల్లా కోహిర్‌ మండలంలో దారుణం జరిగింది. మాచిరెడ్డిపల్లిలో గుర్తుతెలియని వ్యక్తులు బీరు సీసాతో యువకుడి గొంతుకోసి హత్య చేశారు. మృతుడిని జహీరాబాద్‌లోని ఆర్యనగర్‌కు చెందిన శ్రీకాంత్‌(30)గా గుర్తించారు. రాత్రి మద్యం తాగించి హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్య ఘటనతో సంబంధమున్న ఇద్దరు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని