Safer in Jail: పెరోల్ వద్దు.. జైలే ముద్దు!
ఉత్తర్ప్రదేశ్లోని ఖైదీలు మాత్రం తమకు పెరోల్ వద్దని వేడుకుంటున్నారు. బయట కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతున్న వేళ.. జైలులోనే సురక్షితంగా ఉన్నామని అధికారులను అభ్యర్థించారు.
కరోనా వేళ జైలే సురక్షితమంటున్న యూపీ ఖైదీలు
లఖ్నవూ: వివిధ కేసుల్లో జైలుకు వెళ్లిన విచారణ ఖైదీలు, శిక్షపడిన వారు బెయిల్పై బయటకు రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, ఉత్తర్ప్రదేశ్లోని ఖైదీలు మాత్రం తమకు పెరోల్ వద్దని వేడుకుంటున్నారు. బయట కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతున్న వేళ.. జైలులోనే సురక్షితంగా ఉన్నామని అధికారులను అభ్యర్థించారు.
దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో జైళ్లలో ఉన్న ఖైదీలను పెరోల్పై తాత్కాలికంగా విడుదల చేసేందుకు ఉన్న అవకాశాలను న్యాయస్థానాలు పరిశీలిస్తున్నాయి. దీంతో ఇప్పటికే చాలా మంది బెయిల్ పొందలేని ఖైదీలు పెరోల్పై విడుదలవుతున్నారు. కానీ, ఉత్తర్ ప్రదేశ్లోని కొందరు ఖైదీలు మాత్రం తమకు పెరోల్ వద్దని అధికారులను వేడుకుంటున్నారు. ఇలా ఇప్పటివరకు 21 మంది ఖైదీలు తమ పెరోల్ వద్దని అభ్యర్థించినట్లు ఉత్తర్ప్రదేశ్ జైళ్లశాఖ డీజీ ఆనంద్ కుమార్ పేర్కొన్నారు. ఘజియాబాద్, గౌతమ్బుద్ధ నగర్, మీరట్, మహారాజ్గంజ్, గోరఖ్పూర్, లఖ్నవూ జైళ్లనుంచి 21 మంది ఖైదీలు తాము జైళ్లలోనే సురక్షితంగా ఉన్నామని.. పెరోల్పై విడుదల చేయవద్దని అభ్యర్థించినట్లు తెలిపారు.
మూడు నెలలపాటు పెరోల్పై విడుదల అయితే .. అదే కాలాన్ని శిక్ష పడిన కాలానికి అదనంగా కలుపడం ఒక కారణమైతే.. పెరోల్పై బయటకు వెళితే వారికి సరైన ఆహారం, వైద్య సదుపాయాలు లభించకపోవచ్చని ఖైదీలు అభిప్రాయపడుతున్నారు. అవసరమైన వైద్య పరీక్షలు, సమయానికి ఆహారం లభించడంతో జైళ్లలోనే సురక్షితంగా భావిస్తున్నట్లు ఖైదీలు తెలిపినట్లు జైళ్లశాఖ అధికారులు వెల్లడించారు. వీటికి అధికారులు ఎలా స్పందించారు అన్న ప్రశ్నకు.. ఖైదీలు లిఖితపూర్వకంగా ఇచ్చిన అభ్యర్థనను తప్పకుండా గౌరవిస్తామని.. వారు కోరినట్లే ఇక్కడే ఉంచుతామని యూపీ జైళ్లశాఖ డీజీ పేర్కొన్నారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఇప్పటివరకు దాదాపు 9వేల ఖైదీలకు బెయిల్ మంజూరు చేయడంతో పాటు బెయిల్ పొందని 2200 మంది ఖైదీలను పెరోల్పై విడుదల చేశామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సుల మేరకు వీరిని విడుదల చేశామని పేర్కొన్నారు.
ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణతో చాలా జైళ్లలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయనే వార్తలు ఆందోళన కలిగించాయి. ముఖ్యంగా అక్కడ భౌతిక దూరం పాటించడం కుదరకపోవడం సమస్యగా మారింది. ఇలాంటి సమయంలో ఖైదీలను తాత్కాలికంగా విడుదల చేసే చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలు, యూటీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి.. విచారణ, శిక్ష అనుభవిస్తోన్న ఖైదీలకు మధ్యంతర బెయిల్ లేదా పెరోల్పై విడుదల చేయాలని సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?