UP: మద్యం మాఫియా చేతిలో జర్నలిస్ట్ బలి!
ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్కు చెందిన ఓ టీవీ జర్నలిస్ట్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం కలకలం రేపింది. తనకు ప్రాణహాని ఉందని పోలీసు అధికారికి లేఖ రాసిన రెండు రోజులకే....
వేడెక్కిన రాజకీయాలు
ప్రతాప్గఢ్: ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్కు చెందిన ఓ టీవీ జర్నలిస్ట్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం కలకలం రేపింది. తనకు ప్రాణహాని ఉందని పోలీసు అధికారికి లేఖ రాసిన రెండు రోజులకే ఆయన మరణించడం పలు అనుమానాలకు దారితీసింది. సులభ్ శ్రీవాత్సవ ప్రతాప్గఢ్లో టీవీ జర్నలిస్ట్గా పనిచేస్తున్నాడు. అక్కడి మద్యం మాఫియాపై ఆయన పలు కథనాలు అందించారు. దీంతో మద్యం మాఫియా తనపై కక్షగట్టిందని, తనకు ప్రాణహాని ఉందని ఆయన ఏడీజీకి లేఖ రాశారు. కాగా శ్రీవాత్సవ మృతిని పోలీసులు రోడ్డు ప్రమాదంగా పేర్కొంటున్నారు. ఆదివారం రాత్రి 10 నుంచి 11 గంటల ప్రాంతంలో ఇంటికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు తెలిపారు. వర్షం కారణంగా రోడ్డు తడిగా ఉండి, జారడంతో ప్రమాదం జరిగి ఉండవచ్చని వెల్లడిస్తున్నారు.
తూర్పు ప్రతాప్గఢ్ అడిషనల్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. ‘సులభ్ శ్రీవాత్సవ ఓ ప్రాంతానికి వెళ్లి అక్కడ జరిగిన వార్తను కవర్ చేసుకొని వస్తూ ప్రమాదానికి గురయ్యారు. ద్విచక్రవాహనం జారి రోడ్డు పక్కనే ఉన్న స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అక్కడే ఉన్న కొందరు శ్రీవాత్సవను ఆసుపత్రికి తరలించారు. ఆయన కుటుంబానికి కూడా సమాచారం అందించారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఘటనా ప్రాంతానికి పోలీసులు చేరుకొని అది బైక్ జారడం వల్ల జరిగిన ప్రమాదమేనని నిర్ధరించారు. ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నాం’ అని వెల్లడించారు.
జర్నలిస్ట్ అనుమానాస్పద మృతి ఉత్తరప్రదేశ్లో రాజకీయ దుమారం రేపింది. ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) జనరల్ సెక్రెటరీ ప్రియాంకా గాంధీ యూపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘రాష్ట్రంలోని అలీగఢ్ నుంచి ప్రతాప్గఢ్ వరకు మద్యం మాఫియా రాజ్యమేలుతోంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది. నిజాన్ని నిర్భయంగా వెల్లడించే జర్నలిస్టులకు రక్షణ లేదు. ప్రాణహాని ఉందని చెప్పినా ప్రభుత్వం నిద్ర మత్తు వీడలేదు. గూండా రాజ్యాన్ని పెంచి పోషించే యూపీ ప్రభుత్వం.. జర్నలిస్ట్ సులభ్ శ్రీవాత్సవ కుటుంబానికి ఏమని సమాధానమిస్తుంది?’ అని ట్విటర్ వేదికగా మండిపడ్డారు. మద్యం మాఫియా నుంచి ప్రాణహాని ఉందని జర్నలిస్ట్ చెప్పినా ఆయనకు రక్షణ కల్పించకపోవడం సిగ్గుచేటు అని మరికొందరు నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. -
సస్పెన్షన్కు గురైన సబ్రిజిస్ట్రార్ ఇంట్లో అనిశా తనిఖీలు.. రూ. 10 కోట్ల ఆస్తుల గుర్తింపు
మహబూబాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గత నెల 22న లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కిన సబ్రిజిస్ట్రార్ తస్లీమ మహ్మద్ ఇంట్లో అధికారులు సోమవారం మరోసారి తనిఖీలు నిర్వహించారు. -
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం.. 20 కార్లు దగ్ధం!
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి గణపతి కాంప్లెక్స్లో సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే చోట ఈ ఘటన చోటుచేసుకుంది. -
చదువుపై మక్కువతో నవ వధువు బలవన్మరణం
ఉన్నత చదువులు చదువుకుంటానని చెప్పినా కుటుంబసభ్యులు వివాహం చేయడంతో నవ వధువు పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం మంగయ్యబంజర్ గ్రామంలో చోటుచేసుకుంది. -
మహిళపై అమానుషానికి పాల్పడింది సంగారెడ్డి యువకులు!
మహిళపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడి ఆమె మృతికి కారణమైన కేసులో పోలీసులు నిందితులను గుర్తించినట్లు తెలిసింది. -
ఏపీలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వైకాపా నాయకుడి అరెస్టు
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వైకాపా నాయకుడు బోయ మహానందిని మూడో పట్టణ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. -
మంచులో కూరుకుపోయి తెలుగు వైద్య విద్యార్థి మృతి
వైద్య విద్య కోసం కిర్గిజ్స్థాన్ వెళ్లిన తెలుగు విద్యార్థి అక్కడి జలపాతం సందర్శనకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఈ విషాదకర ఘటన ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. -
మూడు పదులు నిండకుండానే ముగిసిన జీవితాలు
పట్టుమని 30 ఏళ్లు కూడా నిండలేదు.. రెండేళ్ల కిందటే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటూ.. ఆనందంగా జీవిస్తున్న ఆ దంపతుల ఆశలు అర్ధంతరంగా ఆవిరైపోయాయి. -
పంట నష్టాలతో రైతు ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా మరిపెడ శివారు మాకుల తండాలో ఇస్లావత్ చీనా(42) అనే రైతు సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయంలో నష్టం, ఆర్థిక సమస్యలతో బలవన్మరణానికి పాల్పడ్డారు. -
రాళ్లు విసిరి.. జెండా కర్రలతో కొట్టి
తెదేపా ఎస్సీ కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. సత్తెనపల్లి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సోమవారం నామినేషన్ వేశారు. -
పల్నాడు జిల్లాలో తెదేపా కార్యాలయానికి నిప్పు
పల్నాడు జిల్లాలో వైకాపా నాయకులు ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం రాత్రి బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలంలో తెదేపా కార్యాలయం వద్ద తాటాకు పందిరికి నిప్పు పెట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి