చంపేసి.. కొవిడ్ మరణం కింద తోసేసి..!
డబ్బు కోసం ఓ యువకుడిని అతడి స్నేహితుడు, మరో నలుగురు కలిసి కిడ్నాప్ చేసి, హత్య చేశారు. నేరం బయటపడకుండా ఉండేందుకు
ఆగ్రా: డబ్బు కోసం ఓ యువకుడిని అతడి స్నేహితుడు, మరో నలుగురు కలిసి కిడ్నాప్ చేసి, హత్య చేశారు. నేరం బయటపడకుండా ఉండేందుకు ఆ హత్యను కొవిడ్ మరణంగా చిత్రీకరించారు. పీపీఈ కిట్లు ధరించి మృతదేహాన్ని దహనం చేశారు. ఉత్తర్ప్రదేశ్లోని ఆగ్రాలో వారం కింద చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆగ్రాకు చెందిన ఓ శీతల గిడ్డంగి యజయాని కుమారుడు సచిన్ చౌహాన్(23)ను అతడి స్నేహితుడు, మరో నలుగురు కలిసి హత్య చేశారు. ఈ నెల 23న ఓ పాడుబడిన వాటర్ ప్లాంట్ వద్దకు సచిన్ను తీసుకెళ్లి ఉద్దేశపూర్వకంగా మద్యం తాగించారు. అనంతరం ఆ అయిదుగురూ కలిసి ప్లాస్టిక్ కవరుతో అతడి నోరు, ముక్కు మూసి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. నేరం బయటపడకుండా ఉండేందుకు ఆ హత్యను కొవిడ్ మరణంగా చిత్రీకరించాలనుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా పీపీఈ కిట్లు ధరించి మృతదేహాన్ని దహనం చేశారు.
అయితే కుమారుడు కనిపించకపోవడంతో సచిన్ తల్లి అతడి మొబైల్కు ఫోన్ చేసింది. కుమారుడు కాకుండా వేరొక వ్యక్తి ఫోన్ ఎత్తి.. సచిన్ మాట్లాడే పరిస్థితిలో లేడంటూ సమాధానమిచ్చాడు. దీంతో సచిన్ తల్లిదండ్రుల్లో అనుమానం మొదలైంది. వెంటనే తమ కుమారుడు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. హత్య చేసిన అయిదుగురు నిందితులను అరెస్టు చేశారు. వారిని ప్రశ్నించగా.. రూ.2 కోట్ల కోసం సచిన్ను హత్య చేసినట్లు వారు అంగీకరించారు. 25 రోజుల క్రితమే హత్యకు పథకం పన్నినట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు