UP: ‘నన్ను ఎన్కౌంటర్ చేస్తారు’.. భయం మధ్యే గ్యాంగ్స్టర్ యూపీకి తరలింపు
బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అతీక్ అహ్మద్ను ఉత్తర్ప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రయాగ్రాజ్ కోర్టులో హాజరుపరిచేందుకు గాను ఆయన్ను ప్రత్యేక వాహనంలో గుజరాత్ నుంచి యూపీకి తరలిస్తున్నారు.
అహ్మదాబాద్: ఉత్తర్ప్రదేశ్ పోలీసులు తనను బూటకపు ఎన్కౌంటరులో చంపేస్తారని ఆందోళన వ్యక్తం చేస్తూ సమాజ్వాదీ పార్టీ మాజీ ఎంపీ, గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ ఇటీవల సుప్రీం కోర్టును ఆశ్రయించగా ఆయనకు చుక్కెదురైంది. ఈ క్రమంలో గుజరాత్లోని సబర్మతి కేంద్ర కారాగారంలో ఉన్న నిందితుడు అతీక్ను ఓ కేసు విచారణలో భాగంగా కోర్టు ముందు హాజరు పరిచేందుకు ఉత్తర్ప్రదేశ్ పోలీసులు సిద్ధమయ్యారు. తొలుత జైలు నుంచి బయటకు వచ్చేందుకు నిరాకరించిన అతడ్ని చివరకు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎన్కౌంటర్ చేస్తారన్న అతడి భయాల మధ్యే యూపీ పోలీసులు అతీక్ను ప్రయాగ్రాజ్కు తీసుకెళ్లారు. గుజరాత్ నుంచి ప్రయాగరాజ్కు సుమారు 30 గంటల పాటు వీరి ప్రయాణం సాగనుంది.
2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్యకేసులో అతీక్ అహ్మద్ ప్రధాన నిందితుడు. 2019 నుంచి సబర్మతి జైల్లో ఉంటున్నాడు. ఇతడిపై సుమారు వందకు పైగా క్రిమినల్ కేసులున్నాయి. అయితే, ఎమ్మెల్యే రాజుపాల్ కేసులో ముఖ్యసాక్షిగా ఉన్న ఉమేశ్పాల్ 2005లో కిడ్నాప్కు గురై విడుదలయ్యాడు. ఈ కేసు విచారణ చివరి రోజు (ఫిబ్రవరి 24, 2023)నే ఉమేశ్పాల్ హత్యకు గురయ్యాడు. ఆయనతోపాటు ఇద్దరు అంగరక్షకులను పట్టపగలే కాల్చి చంపడం యూపీలో ఇటీవల సంచలనం సృష్టించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. అయితే, ఉమేశ్పాల్ను హత్య చేసినట్లు భావిస్తోన్న ఓ వ్యక్తి మార్చి 14న జరిగిన పోలీస్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఈ కేసులో అతీక్ అహ్మద్పైనా కేసు నమోదయ్యింది.
మరోవైపు, గతంలో కిడ్నాప్ కేసుకు సంబంధించి మార్చి 28న యూపీ ప్రయాగ్రాజ్ కోర్టు తీర్పు వెలువరించనుంది. దీంతో అతీక్ అహ్మద్ను కోర్టు ముందు హాజరుపరిచేందుకు యూపీ పోలీసులు సబర్మతి సెంట్రల్ జైలుకు ఆదివారం ఉదయం చేరుకున్నారు. అయితే, యూపీ పోలీసులు చంపేస్తారేమోననే భయంతో ఉన్న అతడు.. జైలు నుంచి బయటకు వచ్చేందుకు తొలుత నిరాకరించాడు. సబర్మతి జైలు అధికారులతో సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం యూపీ పోలీసులు అతన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారమే అందరి నిందితులను కోర్టు ముందు ప్రవేశపెట్టాల్సి ఉందని ప్రయాగ్రాజ్ సిటీ పోలీస్ కమిషనర్ రామిత్ శర్మ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!