Crime News: హైదరాబాద్ శివారులో జంట హత్యలు.. భర్తే స్క్రూడ్రైవర్తో చంపేశాడు!
హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్మెంట్ మండలం కొత్తగూడెం సమీపంలో జరిగిన జంట హత్యల కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు.
అబ్దుల్లాపూర్మెట్: హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్మెట్ మండలం కొత్తగూడెం సమీపంలో జరిగిన జంట హత్యల కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. వివాహేతర సంబంధంతోనే యశ్వంత్, జ్యోతి హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సాంకేతిక ఆధారాల సాయంతో మృతురాలి భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. ఆయనే ఈ హత్యలకు పాల్పడినట్లు ప్రాథమికంగా తేల్చారు. వివాహేతర సంబంధంతోనే ఈ హత్యలు చేసినట్లు మృతురాలి భర్త ఒప్పుకొన్నట్లు తెలిసింది.
30 కి.మీ వెంబడించి..
గతకొంతకాలంగా యశ్వంత్, జ్యోతి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు భర్త గుర్తించాడు. ఓసారి ఇంట్లోనే వీరిద్దరూ ఏకాంతంగా గడుపుతుండటాన్ని చూసి ఆయన హెచ్చరించారు. అయినప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం వారాసిగూడ నుంచి యశ్వంత్, జ్యోతి కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండటాన్ని భర్త గుర్తించి వారిని వెంబడించాడు. అక్కడి నుంచి సుమారు 30 కి.మీ దూరంలోని అబ్దుల్లాపూర్మెట్ మండలం కొత్తగూడ సమీపంలో చెట్లపొదల్లోకి వారు వెళ్లడాన్ని గమనించాడు.
మద్యం తాగి.. ఆవేశాన్ని అణచుకోలేక..
యశ్వంత్, జ్యోతి ఏకాంతంగా గడుపుతుండటాన్ని భర్త నేరుగా చూశాడు. మార్గంమధ్యలో కొనుగోలు చేసి తీసుకెళ్లిన మద్యాన్ని అక్కడే తాగాడు. అనంతరం ఆవేశాన్ని అణచుకోలేక పక్కనే ఉన్న రాయి తీసుకెళ్లి జ్యోతి తలపై మోదాడు దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఆ తర్వాత తన వెంట తెచ్చుకున్న స్క్రూడ్రైవర్తో యశ్వంత్ గుండెపై ఒక్కసారిగా పొడిచాడు. దీంతో యశ్వంత్ కుప్పకూలి అపస్మారకస్థితికి వెళ్లాడు. అప్పటికే కసితో రగిలిపోతున్న జ్యోతి భర్త.. యశ్వంత్ మర్మాంగంపైనా దాడి చేసి ఛిద్రం చేశాడు. ఇద్దరూ చనిపోయారని నిర్ధారించుకున్నాక అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
మరోవైపు ఈ హత్యలను తానొక్కడినే చేసినట్లు జ్యోతి భర్త చెబుతున్నాడు. కానీ పోలీసులు మాత్రం జ్యోతి భర్తతోపాటు ఆమె సమీప బంధువులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఒక్కడే ఈ హత్యలు చేశాడా? ఇంకెవరి ప్రమేయమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే దీనిపై పోలీసులు అధికారికంగా వివరాలు వెల్లడించాల్సి ఉంది.
కేసు నేపథ్యమిదీ..
అబ్దుల్లాపూర్మెట్ మండలం కొత్తగూడెం సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి వచ్చిన ఒక యువకుడు, మహిళను దుండగులు అతి దారుణంగా హతమార్చారు. మూడు రోజుల తరువాత మంగళవారం ఈ ఘటన వెలుగు చూసింది. ఎన్హెచ్ 65 పక్కన రెండు మృతదేహాలున్నట్టు స్థానికులిచ్చిన సమాచారంతో అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు అక్కడికి వెళ్లారు. నగ్నంగా పడి ఉన్న మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా మారాయి. సమీపంలో నిలిపి ఉన్న ద్విచక్ర వాహనం (టీఎస్10ఎఫ్బి 2384) ఆధారంగా వివరాలు సేకరించారు. వాహన యజమాని వారాసిగూడకు చెందిన యడ్ల అనిరుధ్ను రప్పించారు. ఆయన వచ్చి.. మృతదేహం తన సోదరుడు యశ్వంత్ (22)దిగా గుర్తుపట్టారు. అక్కడ దొరికిన చేతిసంచిలోని రసీదు ఆధారంగా మృతురాలు వారాసిగూడకు చెందిన జ్యోతి (30) అని గుర్తించారు.
ఫోన్కాల్తో బయటకు..
వారాసిగూడకు చెందిన యడ్ల యశ్వంత్ క్యాబ్ డ్రైవర్. అతడి తండ్రి కొబ్బరిబొండాలు విక్రయించేవారు. యశ్వంత్ మొదట్లో డ్రైవర్గా పనిచేసి.. ఇటీవలే కారు కొని అద్దెకు తిప్పుతున్నాడు. అదే ప్రాంతంలో జ్యోతి కుటుంబం ఉండేది. ఆమె భర్త స్టీలు సామాన్లు విక్రయించేవాడు. వారికి ఇద్దరు పిల్లలు. ఆదివారం సాయంత్రం యశ్వంత్కు ఫోన్కాల్ రావటంతో సోదరుడి ద్విచక్ర వాహనం తీసుకుని 7 గంటల సమయంలో బయటకు వెళ్లాడు. తర్వాత జ్యోతిని వెంటబెట్టుకుని.. సంఘటన స్థలానికి వచ్చాడు. హత్యలు జరిగిన ప్రాంతం ముళ్లచెట్లు, పొదలతో నిండి ఉంటుంది. కల్లుగీత కోసం వెళ్లిన కార్మికుడొకరు తాటిచెట్టు ఎక్కినప్పుడు దుర్వాసన రావటంతో మృతదేహాలను గుర్తించాడు. గ్రామంలోకి వెళ్లి విషయం చెప్పటంతో పోలీసులకు సమాచారం చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
అన్నమయ్య జిల్లా రాయచోటిలోని వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో లిఫ్ట్ తెగిపడి 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. -
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
Crime News: తమ పొరుగునే ఉంటున్న వ్యక్తి చేతిలో ఓ యువతి లైంగిక దోపిడీకి గురైంది. శారీరకంగా హింస అనుభవించింది. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు