Hyderabad: మాజీ సీఐ నాగేశ్వర్రావుపై 600 పేజీల ఛార్జ్షీట్.. కోర్టుకు సమర్పించిన పోలీసులు
అత్యాచారం కేసులో డిస్మిస్ అయిన మాజీ సీఐ నాగేశ్వర్రావు కేసులో వనస్థలిపురం పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు.
హైదరాబాద్: అత్యాచారం కేసులో డిస్మిస్ అయిన మాజీ సీఐ నాగేశ్వర్రావు కేసులో వనస్థలిపురం పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఎల్బీ నగర్ కోర్టుకు సమర్పించిన 600 పేజీల ఈ ఛార్జ్షీట్లో 75 మంది సాక్షులను చేర్చారు. నాగేశ్వర్ రావు నేరం చేశారనడానికి తగిన ఆధారాలను పొందుపర్చారు.
ఈ ఏడాది జులై 7న వనస్థలిపురం పోలీస్స్టేషన్లో నాగేశ్వర్రావుపై ఓ మహిళ ఫిర్యాదు చేశారు. తనపై అత్యాచారం చేయడంతో పాటు.. అపహరించారని బాధిత మహిళ పోలీసులకు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. జులై 11న నాగేశ్వర్రావును అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు రిమాండ్కు తరలించారు. ఆ తర్వాత అదే నెల 18న కస్టడీలోకి తీసుకొని ఐదు రోజుల పాటు ప్రశ్నించారు. నాగేశ్వర్రావు అత్యాచారం చేశారనడానికి తగిన ఆధారాలు సేకరించారు. మహిళ లోదుస్తుల్లో నమూనాలు సేకరించి నాగేశ్వర్రావు డీఎన్ఏతో సరిపోల్చారు. ఎఫ్ఎస్ఎల్ నివేదికలో ఈ రెండూ సరిపోలాయి. సీసీ కెమెరా దృశ్యాలను సైతం పరిశీలించారు.
నాగేశ్వర్రావు మొబైల్ను విశ్లేషించి అత్యాచారం జరిగిన సమయంలో ఆయన మహిళ ఇంట్లోనే ఉన్నట్లు తేల్చారు. మహిళ నివాసముండే ఇంటి వాచ్మెన్తో పాటు చుట్టుపక్కల వాళ్ల సాక్ష్యాలను నమోదు చేశారు. ఈ విషయాలన్నింటినీ ఛార్జ్షీట్లో పొందుపర్చారు. ఈ కేసు విచారణ ఎల్బీ నగర్ కోర్టులో కొనసాగుతోంది. నాగేశ్వర్రావు హైకోర్టు నుంచి బెయిల్ పొందడంతో చర్లపల్లి జైలు నుంచి బయటికి వచ్చాడు. అత్యాచార ఆరోపణలు రావడంతో ఆయన్ను ఇటీవలే హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ విధుల నుంచి తొలిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?