విజయవాడ: భార్యను చంపిన వ్యక్తికి ఉరిశిక్ష
భార్యపై పెట్రోల్ పోసి హత్య చేసిన కేసులో భర్తకు విజయవాడ మహిళా సెషన్స్ న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. 2019లో నగరంలోని కృష్ణలంకలో గర్భవతిగా ఉన్న
విజయవాడ: భార్యపై పెట్రోల్ పోసి హత్య చేసిన కేసులో భర్తకు విజయవాడ మహిళా సెషన్స్ న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. 2019లో నగరంలోని కృష్ణలంకలో గర్భవతిగా ఉన్న తన భార్యపై భర్త బత్తుల నంబియార్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆమె మృతిచెందింది. ఈ కేసులో నిందితుడికి మరణశిక్ష విధిస్తూ న్యాయస్థానం ఈరోజు తీర్పు వెలువరించింది.
అసలేం జరిగిందంటే..
కృష్ణాజిల్లా కోడూరు మండలం లింగాయపాలెంకు చెందిన ముక్కు మోహనరావుకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె శైలజ.. తన ఇద్దరు చెల్లెళ్లు పద్మజ, జ్యోతి, తమ్ముడు అరవింద్ కుమార్తో కలిసి కొన్నేళ్ల కిందట లబ్బీపేటలోని ఫకీర్గూడెం పిడికిటి రామకోటయ్య వీధిలోని ఒక ఇంట్లో అద్దెకు దిగారు. అందరూ ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. బీఎస్సీ బీఈడీ చదివిన శైలజ(30) టిక్కిల్రోడ్లోని ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసేవారు. ఆమెకు కృష్ణాజిల్లా జొన్నపాడు నివాసి, గుడివాడలో ప్రైవేటు కళాశాలలో సహాయ అధ్యాపకుడిగా పనిచేస్తున్న బత్తుల నంబియార్(35) అలియాస్ సుజిత్తో వివాహమైంది. పెళ్లయిన కొద్ది రోజులకే అతడు ఉద్యోగాన్ని మానేసి, విజయవాడ ఫకీర్గూడెంలోని భార్య వద్దే ఉండేవాడు. ఆమె సంపాదనపైనే ఆధారపడి జీవించేవాడు.
ఈ నేపథ్యంలో భార్యకు వేరొకరితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానం అతనిలో మొదలైంది. ఇవే విషయాలను పలు సందర్భాల్లో మరదళ్లు, అత్త వద్ద ప్రస్తావించినప్పటికీ వారు పట్టించుకోలేదు. దీనికి తోడు ఇటీవల శైలజ తన ఇద్దరు చెల్లెళ్లకు, తమ్ముడికి వివాహాలు జరిపించడంతో నంబియార్లో అసూయ రేగింది. గర్భిణి అయిన ఆమెను అంతం చేయాలనే నిర్ణయానికి వచ్చి ఇంట్లో తాను, భార్య తప్ప ఇతరులు లేని సమయం చూసి, తెల్లవారుజామున నిద్రలో ఉన్న శైలజ ఒంటిపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఇరుగుపొరుగు వారు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్సపొందుతూ కొద్దిసేపటికే ఆమె మరణించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నంబియార్ను కోర్టులో హాజరు పరిచారు. విచారణ అనంతరం నంబియారే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో అతడికి న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ డీసీపీ రాధాకిషన్రావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. -
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
మహారాష్ట్రలోని కల్యాణ్లో ఓ రైలు ప్రయాణికుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో పోలీసులు మరో కేసులోని డెత్ మిస్టరీని ఛేదించారు. -
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఐ గట్టుమల్లు విచారణ ముగిసింది. గురువారం అర్ధరాత్రి వరకు ఆయన్ను దర్యాప్తు బృందం విచారించింది. -
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
వైకాపా నేత బావమరిది నకిలీ కరెన్సీ నోట్లతో ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేయబోయి అక్కడి సిబ్బందికి దొరికిపోయాడు. -
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో తనిఖీలు
బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. -
ముంబయిలో రూ.6 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి నలుగురు వ్యక్తుల నుంచి 3 కిలోల మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. -
పరీక్షలో జవాబు పత్రం చూపించలేదని ఘోరం
పదో తరగతి పరీక్షలో తమకు జవాబు పత్రం చూపించలేదన్న ఆగ్రహంతో ఓ విద్యార్థిపై ముగ్గురు సహచర విద్యార్థులు తీవ్రంగా దాడి చేసి కత్తితో గాయపరిచిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. -
అయిదేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడి అరెస్టు
దేశ రాజధానిలో దిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. అయిదేళ్ల చిన్నారిపై ఓ ఫ్యాక్టరీ కార్మికుడు అత్యాచారానికి పాల్పడి హతమార్చాడు. -
గ్రూప్-1 ఉద్యోగాల పేరిట టోకరా.. పోలీసుల అదుపులో నిందితుడు
‘గ్రూప్-1’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఓ నిందితుడిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కోటాలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్లో పోటీ పరీక్షల శిక్షణ సంస్థలకు నెలవైన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. -
ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు
మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దున కాంకర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధ, గురువారాల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. -
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
ఎయిర్ బ్లోయర్ నాజిల్ను మర్మాంగంలోకి చొప్పించడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
ట్రాక్టర్ల వ్యాపారానికి ఫోర్స్ మోటార్స్ గుడ్బై
-
ఆప్కు మరో షాక్.. సత్యేందర్ జైన్పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఓకే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు