అంత్యక్రియలకు డబ్బుకోసం.. శవంతో బ్యాంకుకు!
బిహార్లో పట్నాకు సమీపంలోని ఓ గ్రామంలో గురువారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మరణించగా.. అతడి అంత్యక్రియలకు డబ్బు కావాలంటూ స్థానికులు మృతదేహాన్ని తీసుకుని బ్యాంకుకు వెళ్లడం కలకలం సృష్టించింది.
పట్నా: బిహార్లో పట్నాకు సమీపంలోని ఓ గ్రామంలో గురువారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మరణించగా.. అతడి అంత్యక్రియలకు డబ్బు కావాలంటూ స్థానికులు మృతదేహాన్ని తీసుకుని బ్యాంకుకు వెళ్లడం కలకలం సృష్టించింది. స్థానిక పోలీసు అధికారి అమరేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్నా సమీపంలోని సింగ్రియవాన్ గ్రామానికి చెందిన చెందిన మహేష్ యాదవ్(55) అనే వ్యక్తి ఒంటరిగా జీవించేవారు.. అనారోగ్య కారణాలతో మంగళవారం మృతి చెందాడు. అతడి ఇంట్లో ఎవరూ ఉండకపోవడంతో.. మరణించిన తర్వాత చాలా సేపటికి చుట్టుపక్కల వారు మృతదేహాన్ని గుర్తించారు.
మృతదేహాన్ని గుర్తించిన అనంతరం స్థానికులు.. అంత్యక్రియలు నిర్వహించేందుకు అతడి ఇంట్లో ఏమైనా డబ్బు దొరుకుతుందేమోనని పరిశీలించారు. ఈ క్రమంలో వారికి అతడి బ్యాంకు పాస్బుక్ మినహా ఏమీ దొరకలేదు.అందులో రూ.1.17 లక్షలు ఉన్నట్టుగా ఉంది. దీంతో అంత్యక్రియల ఖర్చులకై మృతుడి అకౌంట్లో డబ్బులు విత్డ్రా చేసేందుకు నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా.. ఏకంగా మృతదేహాన్నే తీసుకుని బ్యాంకుకు వెళ్లి సిబ్బందిని ఆందోళనకు గురిచేశారు. ‘డబ్బులు ఇస్తేనే ఇక్కడి నుంచి కదులుతాం.. లేదంటే అంత్యక్రియలు నిర్వహించేది లేదు’అని డిమాండు చేశారు. ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని బ్యాంకు సిబ్బందికి నచ్చజెప్పడంతో అప్పుడు వారు కొంచం డబ్బును ఇచ్చేందుకు అంగీకరించారు. అనంతరం గ్రామస్థులు అక్కడి నుంచి దహనవాటికకు వెళ్లి మహేష్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సంబంధిత బ్యాంకు మేనేజర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. సదరు వ్యక్తులు సృష్టించిన సన్నివేశం తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. తన సర్వీసులో ఇలాంటి ఘటన మొదటిసారి చూశానని చెప్పారు.
ఇదీ చదవండి
మార్టూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
వైకాపా నేత బావమరిది నకిలీ కరెన్సీ నోట్లతో ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేయబోయి అక్కడి సిబ్బందికి దొరికిపోయాడు. -
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో తనిఖీలు
బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. -
ముంబయిలో రూ.6 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి నలుగురు వ్యక్తుల నుంచి 3 కిలోల మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. -
పరీక్షలో జవాబు పత్రం చూపించలేదని ఘోరం
పదో తరగతి పరీక్షలో తమకు జవాబు పత్రం చూపించలేదన్న ఆగ్రహంతో ఓ విద్యార్థిపై ముగ్గురు సహచర విద్యార్థులు తీవ్రంగా దాడి చేసి కత్తితో గాయపరిచిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. -
అయిదేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడి అరెస్టు
దేశ రాజధానిలో దిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. అయిదేళ్ల చిన్నారిపై ఓ ఫ్యాక్టరీ కార్మికుడు అత్యాచారానికి పాల్పడి హతమార్చాడు. -
గ్రూప్-1 ఉద్యోగాల పేరిట టోకరా.. పోలీసుల అదుపులో నిందితుడు
‘గ్రూప్-1’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఓ నిందితుడిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కోటాలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్లో పోటీ పరీక్షల శిక్షణ సంస్థలకు నెలవైన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. -
ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు
మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దున కాంకర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధ, గురువారాల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. -
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
ఎయిర్ బ్లోయర్ నాజిల్ను మర్మాంగంలోకి చొప్పించడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
కన్నారా.. ఇది విన్నారా?