Andhra News: పింఛను డబ్బు తీసుకొని ప్రియురాలితో వాలంటీర్‌ పరారీ

పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెంలో ఓ వాలంటీర్‌ పింఛను డబ్బులు తీసుకొని ప్రియురాలితో పరారయ్యాడు.

Updated : 06 Apr 2022 16:45 IST

బొల్లాపల్లి: పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెంలో ఓ వాలంటీర్‌ పింఛను డబ్బులు తీసుకొని ప్రియురాలితో పరారయ్యాడు. గ్రామ సచివాలయ సిబ్బంది ఈ విషయాన్ని వాలంటీర్‌ తండ్రి దృష్టికి తీసుకొచ్చారు. పింఛనుదారులు ఇబ్బంది పడకూడదని కుమారుడు తీసుకెళ్లిన మొత్తాన్ని వాలంటీర్‌ తండ్రి సచివాలయ సిబ్బందికి అందించారు. అనంతరం వారు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. పెళ్లయి పిల్లలున్న వాలంటీర్‌ ఇలా చేయడంపై అమ్మాయి తరఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ వాలంటీర్‌ రవి పింఛన్లు సరిగా పంపిణీ చేయలేదనే ఆరోపణలున్నట్లు స్థానికులు చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని