Andhra news: విజయనగరం జిల్లాలో వార్డు వాలంటీర్ ఘరానా మోసం
విజయనగరం జిల్లాలో వార్డు వాలంటీర్ ఘరానా మోసానికి పాల్పడ్డారు. జిల్లాలోని సాలూరులో వార్డు వాలంటీర్గా విధులు నిర్వర్తిస్తున్న రమ్య..
సాలూరు: విజయనగరం జిల్లాలో వార్డు వాలంటీర్ ఘరానా మోసానికి పాల్పడింది. జిల్లాలోని సాలూరులో వార్డు వాలంటీర్గా విధులు నిర్వర్తిస్తున్న రమ్య.. ఆమె తల్లితో కలిసి పొదుపు చేయండి.. వడ్డీతో పొందండి.. అని నమ్మించి వందల మందిని మోసం చేసింది. మురికివాడ ప్రజలు, నిరుపేదలను లక్ష్యంగా చేసుకుని పొదుపు పేరుతో వ్యాపారం ప్రారంభించింది. బాధితుల నుంచి సుమారు రూ.3 కోట్లు వసూలు చేసి పరారైంది.
సాలూరు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని చిట్లు వీధికి చెందిన మానాపురం రమ్య వార్డు వాలంటీర్గా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె తల్లి అరుణతో కలిసి గత 15 ఏళ్లుగా పొదుపు వ్యాపారం సాగిస్తోంది. చిట్లు వీధి, సారిక వీధి, కోట వీధి, గుమడాం, పెద్ద మార్కెట్, చినబజారు, వడ్డివీధి.. ఇలా ఒకటీ.. రెండు అని కాకుండా వార్డులో ఇంటింటికీ వెళ్లి మహిళలకు పొదుపు ఆశ చూపారు. అలా సుమారు 2వేల మంది దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు. రోజుకి రూ.10 నుంచి రూ.200 వరకు వసూలు చేశారు. తక్కువలో రూ.10 కట్టినవారికి రూ.4వేలు, రూ.200 కట్టిన వారికి రూ.80వేలు ఏడాదికి వడ్డీతో చెల్లిస్తామని చెప్పి నమ్మించారు. గతేడాది డిసెంబరు నెలతో ఏడాది గడువు పూర్తయిన సుమారు 150 మందికి ఇప్పటివరకు డబ్బులు చెల్లించలేదు. అడిగితే బ్యాంకులో డబ్బులు పెద్ద మొత్తంలో ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు. 10 రోజుల కిందట పెళ్లి పేరు చెప్పి రమ్య, ఆమె తల్లి అరుణతో కలిసి ఊరు నుంచి వెళ్లారు. తిరిగి రాకపోవడం.. ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో పొదుపు చేసిన వారందరికీ అనుమానం వచ్చింది. వాలంటీర్ బంధువులను అడిగినా ఎవరూ సరైన సమాధానం చెప్పక పోవడంతో బాధితులంతా మోసపోయామని గ్రహించి శుక్రవారం సాయంత్రం పట్టణ పోలీసులను ఆశ్రయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?