‘SUVలో రేప్కు అంత స్థలం ఉంటుందా..?’
గుజరాత్లోని వడోదర ఆర్టీఓ అధికారులకు ఓ వింతైన అభ్యర్థన వచ్చింది. ఒక స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం
ఆర్టీవో అధికారులకు పోలీసుల నుంచి వింత అభ్యర్థన
వడోదర : గుజరాత్లోని వడోదర ఆర్టీఓ అధికారులకు ఓ వింతైన అభ్యర్థన వచ్చింది. ఒక స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం(ఎస్యూవీ)లో అత్యాచారానికి పాల్పడే అంత స్థలం ఉంటుందా.. నిర్ధారించాలని జిల్లా పోలీసు విభాగానికి చెందిన స్థానిక క్రైమ్ బ్రాంచ్ నుంచి ఆర్టీవో అధికారులకు ఓ అభ్యర్థన అందింది. ఓ అత్యాచార కేసు విచారణకు సంబంధించి క్రైమ్ బ్రాంచ్ ఈ సమాచారాన్ని కోరింది. ఎస్యూవీలో ముందు సీటుని వెనక్కి నెట్టిన తర్వాత తగినంత స్థలం ఉంటుందా.. తెలియజేయాలని పేర్కొంది. అలాగే వాహనం సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ గురించి కూడా సమాచారం కావాలని అడిగింది.
ఇలాంటి సమాచారం కోరడం ఇదే మొదటిసారని ఆర్టీవో అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సీట్లను వెనక్కి నెట్టడం ద్వారా లభించే స్థలం, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ గురించి సాంకేతిక ధ్రువీకరణ పత్రం కావాలని పోలీసులు అడిగారని ఆర్టీవో అధికారులు తెలిపారు. అయితే ఆర్టీవో కేవలం గణిత నివేదికను మాత్రమే ఇవ్వగలదని అధికారులు స్పష్టం చేశారు. నేరం జరిగిందో లేదో పోలీసులే నిర్ధారించాలని పేర్కొన్నారు.
బాధితురాలు పేర్కొన్నట్లుగా ఆ వాహనంలో నేరం జరిగిందని నిరూపించడానికి ఆ వాహనానికి సంబంధించి సాంకేతిక ధ్రువీకరణ పత్రం అవసరమని.. అందుకే ఆర్టీవోను ఆ సమాచారం కోసం కోరినట్లు క్రైమ్బ్రాంచ్ అధికారులు తెలిపారు.
గత నెల 26 అర్ధరాత్రి సమయంలో ఈ అత్యాచార ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఈ కేసులో నిందితుడైన పాద్రా మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ భవేశ్ పటేల్ను మే 2న అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. పటేల్ స్థానికంగా పేరున్న నాయకుడని.. అతడిపై ఇదివరకే 18 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ కేసులో బలమైన ఆధారలు సంపాదించడం కోసం ఆర్టీవో అధికారులను సంప్రదించినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు సహా ఐదుగురిపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. -
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
గంజాయి విక్రేతలు కొత్త పంథా అనుసరిస్తున్నారు. హ్యాష్ ఆయిల్.. చాక్లెట్లుగా మార్చి విక్రయించడం పాత ట్రెండు.. ఇప్పుడు గంజాయిని పొడిగా చేసి విక్రయిస్తున్నారు. -
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని నార్కట్పల్లి-అద్దంకి రహదారి నల్గొండ జిల్లా కేంద్రంలో భారాస నాయకుడు మృతిచెందారు. -
ప్రకాశం జిల్లాలో మద్యం డంప్ స్వాధీనం
ప్రకాశం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్శి సెబ్ కార్యాలయంలో ఎస్పీ గరుడ్ సుమిత్సునీల్ బుధవారం వివరాలను వెల్లడించారు. -
మావోయిస్టులకు శరాఘాతం!
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీ భారీ మూల్యం చెల్లించుకుంది. -
జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది పరారీ
కిటికీ గ్రిల్స్ తొలగించి జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది బాలురు పరారైన ఘటన మేడ్చల్ జిల్లా గాజులరామారంలో సంచలనం సృష్టించింది. -
తప్పుడు ప్రకటనలతో మందుల విక్రయం
జ్వరాన్ని నయం చేస్తుందని తప్పుడు ప్రకటనలతో విక్రయిస్తున్న మందులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
గుజరాత్లో రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
గుజరాత్లో ఆగివున్న చమురు ట్యాంకర్ను వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 10 మంది దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. -
అనంత్నాగ్లో బిహార్ కూలీని కాల్చిచంపిన ఉగ్రవాదులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదులు మరోమారు పేట్రేగిపోయారు. బుధవారం అనంత్నాగ్ జిల్లాలో బిహార్కు చెందిన కూలీని కాల్చి చంపారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.27 అధిక వసూలు.. ఉబర్ ఇండియాకు రూ.28,000 జరిమానా
-
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
-
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
-
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్రెడ్డి
-
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
-
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్