Crime News: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

గుంటూరు జిల్లా పొన్నూరు భావనగర్‌ కాలనీలో జలచిత్ర నాగరాజు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు.

Published : 14 Jan 2022 01:36 IST

పొన్నూరు: గుంటూరు జిల్లా పొన్నూరు భావనగర్‌ కాలనీలో జలచిత్ర నాగరాజు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. నాగరాజు భార్య, ఆమె ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగింది. హత్య చేసిన తర్వాత నిందితులిద్దరూ మృతదేహాన్ని అప్పికట్ల కాలువలో పడేశారు. నాగరాజు మృతదేహాన్ని ఇవాళ పొన్నూరు అర్బన్‌ పోలీసులు వెలికితీయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది

వివరాల్లోకి వెళ్తే.. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లికి చెందిన నాగరాజుకు షెమా సోనీతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. దంపతులిద్దరూ గత కొన్ని రోజుల క్రితం పొన్నూరుకు వచ్చి ఇల్లు అద్దెకు తీసుకొని జీవనం సాగిస్తున్నారు. సోనీకి అదే కాలనీకి చెందిన మరో యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి నాగరాజును హత్య చేయాలని పథకం వేశారు. ఈ నెల 7న ఇంట్లోనే అతడిని హత్య చేసి బాపట్ల మండలం అప్పిగట్ల సమీపంలోని కాలువలో మృతదేహాన్ని పడేశారు. కుటుంబ సభ్యులు నాగరాజు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగు చూసింది. నిందితులు హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. అనంతరం కాలువలో గాలింపు చర్యలు చేపట్టగా ఇవాళ నాగరాజు మృతదేహం లభ్యమైంది. పంచనామా నిర్వహించిన అనంతరం నాగరాజు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ ఘటనపై మరింత దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్‌ సీఐ శరత్‌బాబు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని