Delhi: దారివ్వాలని కారు హారన్ మోగించినందుకు మహిళపై దాడి!
గుడ్గావ్లో రోడ్డుపై దారివ్వమని కారు హారన్ మోగించిన మహిళపై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటనలో సదరు మహిళ ఎడమ కన్ను, ముక్కుపై గాయాలైనట్లు తెలిపింది.
దిల్లీ: దేశ రాజధానిలో మహిళలపై వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం మహిళను కారుతో ఈడ్చుకెళ్లిన ఉదంతం మరవకముందే.. గురువారం దిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ స్వాతి మాలివాల్ను కారుతో కొన్నిమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా హారన్ కొట్టారనే కారణంతో కారులో వెళుతున్న మహిళను ఆపి నడిరోడ్డులో ఆమెపై దాడికి పాల్పడిన ఘటన గుడ్గావ్ ఎమ్డీఐ చౌక్లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గుడ్గావ్కు చెందిన ఓ మహిళ ఆర్థికసేవలకు సంబంధించిన ఓ సంస్థలో పనిచేస్తోంది. బుధవారం రాత్రి ఆమె కారులో వెళుతుండగా.. వెనుక నుంచి వచ్చిన ఓ కారు ఆమె వాహనాన్ని ఓవర్టేక్ చేసి దారికి అడ్డుగా ఆగింది. అందులోంచి దిగిన ఓ వ్యక్తి బాధిత మహిళను కారు నుంచి బయటకు లాగి పలుమార్లు ఆమె చెంపపై కొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొంది. మరోసారి ఇంటికి వచ్చి కొడతానని , చంపేస్తానంటూ సదరు వ్యక్తి బెదిరించినట్లు ఆమె తెలిపింది. రోడ్డుపై వెళుతున్న సమయంలో దారివ్వాలని కారు హారన్ మోగించింనందుకే సదరు వ్యక్తి తనపై నడిరోడ్డులో దాడి చేసినట్లు వాపోయింది. ఈ ఘటన చూసిన కొందరు వ్యక్తులు అక్కడి రావడంతో ఆ వ్యక్తి ఘటనా స్థలం పరారైనట్లు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. దాడిలో తన ఎడమ కన్ను, ముక్కుపై గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నట్లు తెలిపింది. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గుర్తితెలియని వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM