Crime news: అత్యాచారానికి యత్నించి.. వేడి కత్తితో కళ్లపై కాల్చి!
ఉత్తరప్రదేశ్లోని లలిత్పుర్ జిల్లాలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. లైంగిక వేధింపులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ మహిళపై దుండగులు క్రూరత్వానికి పాల్పడ్డారు. వేడి చేసిన కత్తితో తన కళ్లు, కనుబొమ్మలపై కాల్చారు....
లలిత్పుర్: ఉత్తరప్రదేశ్లోని లలిత్పుర్ జిల్లాలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. లైంగిక వేధింపులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ మహిళపై దుండగులు క్రూరత్వానికి పాల్పడ్డారు. వేడి చేసిన కత్తితో కళ్లు, కనుబొమ్మలపై కాల్చారు. లలిత్పుర్ జిల్లా బార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళ.. మార్కెట్కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తోంది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన హిమాన్షు, గంగారామ్ అనే ఇద్దరు వ్యక్తులు ఆమెను అడ్డుకున్నారు. ఆమెను బలవంతంగా నిర్జన ప్రదేశంలోకి లాక్కెళ్లి.. అత్యాచారానికి యత్నించారు. అయితే సదరు మహిళ తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆగ్రహానికి గురైన నిందితులు.. లైటర్ వెలిగించి, కత్తిని వేడి చేసి.. మహిళ కళ్లు, కనుబొమ్మలపై కాల్చారు. అనంతరం తీవ్రంగా కొట్టడంతో బాధితురాలు స్పృహ కోల్పోయింది.
మార్కెట్కు వెళ్లిన మహిళ ఎంతకీ ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె కోసం వెతకటం ప్రారంభించారు. ఓ నిర్జన ప్రదేశంలో స్పహ కోల్పోయిఉండటాన్ని గుర్తించి ఆమెను నేరుగా బార్ పోలీసుస్టేషన్కు తరలించారు. అనంతరం పోలీసుల సూచనతో ఆసుపత్రిలో చేర్చారు. తమ ఇంటి సమీపంలోనే ఉండే ఈ నిందితులు.. మూడు నెలల క్రితం తమ మరదలు, ఆమె భర్తను కూడా ఇదే విధంగా వేధించారని బాధితురాలు పేర్కొంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. కాగా తాజా ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Brahmanandam: చనిపోయే వరకూ కమెడియన్గానే ఉంటా: బ్రహ్మానందం
-
General News
TSPSC: పేపర్ లీకేజీ కేసు స్టేటస్ రిపోర్టు ఇవ్వండి: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
-
General News
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5వేల అప్రెంటిస్ ఖాళీలు.. స్టైఫండ్ ఎంతంటే?
-
Movies News
Social Look: కొత్త స్టిల్స్తో సమంత ప్రచారం.. ఈషారెబ్బా శారీ స్టోరీ!
-
General News
CM Jagan: ‘గోరుముద్ద’ మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు అడుగులు: సీఎం జగన్
-
India News
Amritpal Singh: ‘80 వేల మంది పోలీసులు ఏం చేస్తున్నారు?’.. అమృత్పాల్ పరారీపై న్యాయస్థానం ఆగ్రహం