Hyderabad: ప్రియుడి మరణం తట్టుకోలేక ప్రేయసి బలవన్మరణం
నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి మరణవార్త విని ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి మరణవార్త విని ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్కు చెందిన నేహా (19) గచ్చిబౌలి గౌలిదొడ్డిలో ప్రైవేటు హాస్టల్లో ఉంటూ కేఫ్లో పనిచేస్తుంది. అదే కేఫ్లో పనిచేస్తున్న సహా ఉద్యోగి సల్మాన్ను గత కొంతకాలంగా ప్రేమిస్తోంది. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో సల్మాన్.. గత నెల 30వ తేదీన బాలాపూర్ వెంకటాపురంలోని తన నివాసంలో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన వ్యక్తి మరణించడంతో తట్టుకోలేకపోయిన ఆమె మంగళవారం తను ఉంటున్న హాస్టల్ గదిలోని ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నేహా సోదరి మేఘ ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నేహా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్ధరాత్రి ప్రైవేటు ట్రావెల్ బస్సు దగ్ధం
హైదరాబాద్ నుంచి చీరాల వెళ్తున్న శ్రీకృష్ణా ట్రావెల్స్ బస్సు ఆదివారం అర్ధరాత్రి దాటాక జిల్లా కేంద్రం నల్గొండ సమీపంలో నార్కట్పల్లి-అద్దంకి రహదారిపై మర్రిగూడ బైపాస్ సమీపంలో కాలిపోయింది. -
కుప్పకూలిన శిక్షణ విమానం
మెదక్ జిల్లా తూప్రాన్లోని రావెళ్లి శివారులో సోమవారం దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీకి చెందిన ‘పైలట్ పీసీ 7 ఎంకె 2’ శిక్షణ విమానం ప్రమాదవశాత్తు కుప్పకూలడంతో.. అందులోని పైలట్, శిక్షణ పొందుతున్న మరో వ్యక్తి మృతి చెందారు. -
లోయలో పడిన వాహనం.. ఆరుగురి దుర్మరణం
ట్రక్కు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఆరుగురు కార్మికులు మృతి చెందిన దుర్ఘటన శిమ్లా జిల్లాలోని సున్నీ సమీపంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. -
యువతిని హత్య చేసి.. కాల్చివేసి
గుర్తుతెలియని యువతిని హత్యచేసి కాల్చివేసిన ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం సమీపంలో ప్రధాన రహదారి పక్కన సోమవారం వెలుగుచూసింది. స్థానిక ఎస్సై హరీశ్ వివరాల ప్రకారం..