Crime News:గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత ఆత్మహత్య

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ బాలింత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది

Published : 26 Dec 2021 14:30 IST

గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ బాలింత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కమాన్‌పూర్ మండలం రొంపికుంటకు చెందిన గుమ్మడి ఉమ.. 15 రోజుల క్రితం ప్రభుత్వాస్పత్రిలో ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. వారం రోజులకు ఆమెను డిశ్చార్జ్ చేయాల్సి ఉండగా.. శస్త్రచికిత్స సమయంలో వేసిన కుట్లు మానలేదు. దీంతో మళ్లీ ఆమెకు మూడు సార్లు కుట్లు వేయడంతో.. భరించలేని నొప్పితో ఉమ తల్లడిల్లినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. నొప్పి తట్టుకోలేకే ఆస్పత్రి బాత్‌రూంలో.. చీరతో ఉరేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ.. ఆస్పత్రి ఎదుట ఆమె కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. బాధితులకు న్యాయం చేసి.. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read latest Crime News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని