Warangal: వరంగల్‌లో మహిళా కానిస్టేబుల్‌ అనుమానాస్పద మృతి

 వరంగల్‌(Warangal)లో మహిళా కానిస్టేబుల్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. స్థానిక వేణురావు కాలనీలో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతోంది. 

Updated : 05 Mar 2023 16:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వరంగల్‌(Warangal)లో మహిళా కానిస్టేబుల్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. స్థానిక వేణురావు కాలనీలో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతోంది. మృతురాలిని మహబూబాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో రైటర్‌గా పనిచేస్తున్న మౌనికగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు.

భర్త, అత్తమామలు తమ కుమార్తెను వేధింపులకు గురిచేశారని మౌనిక తల్లిదండ్రులు చెబుతున్నారు. భర్తే ఉరి వేసి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని వారు ఆరోపిస్తున్నారు. మౌనిక మృతదేహంపై గాయాలున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని ఆమె తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని