భర్త కళ్లెదుటే మహిళపై సామూహిక అత్యాచారం!
యూపీలో ఓ మహిళపై దారుణం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులను ముగ్గురు దుండగులు అడ్డగించి మహిళపై సామూహిక......
ఆగ్రాలో దారుణం
ఆగ్రా: యూపీలో ఓ మహిళపై దారుణం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులను ముగ్గురు దుండగులు అడ్డగించి మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన యూపీలోని ఆగ్రా జిల్లా ఎత్మద్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ అమానవీయ ఘటనపై బాధితురాలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం 6గంటల సమయంలో మహిళ తన భర్తతో కలిసి ఎత్మదుల్లా గ్రామంలోని తన పుట్టింటికి వెళ్తుండగా ముగ్గురు యువకులు వారిని మార్గం మధ్యలో అడ్డగించారు. వారిపై దాడిచేసి సమీపంలోని అటవీప్రాంతానికి లాక్కెళ్లారు. అనంతరం భర్త కళ్లెదుటే మహిళపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ దృశ్యాలను వీడియో చిత్రీకరించడమే కాకుండా తమ నుంచి రూ.10వేల నగదు, చెవిపోగులు, ఇతర వస్తువులు లాక్కెళ్లారని మహిళ ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపారు.
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీస్స్టేషన్లో కేసు నమోదైనట్టు ఎస్పీ సత్యజిత్ గుప్తా వెల్లడించారు. ఆమె ఇచ్చిన వాంగ్మూలాన్ని రికార్డు చేసిన అనంతరం నిందితులను పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!