యూపీలో దళిత యువతిపై సామూహిక అత్యాచారం
స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన ఓ దళిత యువతి(19)పై ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తర్ప్రదేశ్లోని బరేలీలో గత నెల 31న చోటుచేసుకుంది.
ఏడుగురు నిందితుల్లో ముగ్గురి అరెస్టు
బరేలీ: స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన ఓ దళిత యువతి(19)పై ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తర్ప్రదేశ్లోని బరేలీలో గత నెల 31న చోటుచేసుకుంది. నిందితుల్లో ఇద్దరిని పోలీసులు ఆదివారం అరెస్టు చేయగా.. మరొకరిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు అబ్బాయిలతో కలిసి యువతి స్కూటీపై బయటకు వెళ్లింది. ఆ సమయంలో నిందితుల్లో ఒకరు వారిని అడ్డగించి తన మిగతా అయిదుగురు స్నేహితులను అక్కడికి పిలిచాడు. వారు వచ్చాక బాధితురాలితో ఉన్న ఇద్దరు అబ్బాయిలను అక్కడి నుంచి తరిమేశారు. తర్వాత ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఆమెను కొట్టి.. డబ్బు తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు.
అయితే ఆ యువతి తనపై జరిగిన ఘాతుకాన్ని తొలుత కుటుంబసభ్యులకు చెప్పలేదు. తర్వాత తన సోదరికి జరిగిన ఘోరాన్ని వివరించింది. నిందితులపై పోలీసులకు శనివారం ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరు నిందితులను శనివారం రాత్రి గుర్తించారు. అయితే వారిని పట్టుకునే క్రమంలో నిందితులు పోలీసులపై కాల్పులు జరిపి పారిపోవడానికి యత్నించారు. కానీ పోలీసులు వారిని వెంబడించి ఒకరి కాలిపై తుపాకీతో కాల్చారు. దీంతో వారు పోలీసులకు లొంగిపోయారు. గాయపడిన నిందితుడిని ఆసుపత్రిలో చేర్చారు. అరెస్టయిన వారిని విశాల్ పటేల్(22) అనుజ్ పటేల్(23) గా గుర్తించారు. వికాస్ అనే వ్యక్తి అత్యాచార ఘటనను ఫొటోలు తీసినట్టు పోలీసులు గుర్తించారు. అతడిని ఆదివారం అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. మరో నిందితుడిని సోమవారం అరెస్టు చేశారు. వారు చేసిన నేరానికి సంబంధించి ప్రస్తుతం అతడిని ప్రశ్నిస్తున్నారు. అయితే అత్యాచార ఘటనపై ఓ ప్రత్యక్ష సాక్షి వివరాలు తెలిపినట్టు పోలీసులు చెప్పారు. పరారీలో ఉన్న నలుగురు నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్