crime: అత్తను చంపి గోనె సంచిలో కుక్కిన కోడలు
అత్తతో గొడవపడిన కోడలు చివరికి ఆమెను తన ఇంట్లోనే పాశవికంగా హత్య చేసింది. భర్త సాయంతో ఆమె మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి అక్కడి నుంచి తరలించేందుకు చేసిన ప్రయత్నంలో పొరుగు వ్యక్తి కంటపడి పోలీసులకు దొరికిపోయింది. అత్యంత దారుణమైన ఈ ఘటన పుణె సమీపంలోని తాలెగావ్
మృతదేహం తరలింపులో సాయం చేసిన భర్త
పుణె: అత్తతో గొడవపడిన కోడలు చివరికి ఆమెను తన ఇంట్లోనే పాశవికంగా హత్య చేసింది. భర్త సాయంతో ఆమె మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి అక్కడి నుంచి తరలించేందుకు చేసిన ప్రయత్నంలో పొరుగు వ్యక్తి కంటపడి పోలీసులకు దొరికిపోయింది. అత్యంత దారుణమైన ఈ ఘటన పుణె సమీపంలోని తాలెగావ్ దభడేలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. బేబీ గౌతమ్ షిండే(50)కుమారుడు మిలింద్ గౌతమ్ షిండేతో పూజ మిలింద్ షిండే(22)కు వివాహం జరిగింది. భార్యభర్తలిద్దరూ ఓ భారీ గోనె సంచిని ఆదివారం ఇంట్లోంచి బయటకు తీసుకెళ్లడం వారి పొరుగు వ్యక్తి గమనించాడు. వారిద్దరూ అనుమానాస్పదంగా కనిపించడంతో ఆ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కాలనీలోని సీసీ టీవీల్లో రికార్డయిన దృశ్యాలను సేకరించారు. నిందితులిద్దరూ ఓ గోనె సంచిని తమ ఇంట్లోంచి బయటకు తీసుకెళ్లడం అందులో రికార్డయింది. ఆ తర్వాత సమీపంలోని ఖాళీ స్థలంలో ఉన్న చెట్ల పొదల్లో మృతదేహాన్ని పోలీసులు గర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి విచారించగా హత్య చేసిన తీరును పోలీసులకు వివరించారు. పూజ, తన అత్తకు మధ్య శుక్రవారం గొడవ జరిగింది. అనంతరం తన అత్త గొంతుకు జాకెట్ను గట్టిగా బిగించి పూజ ఆమెను హత్య చేసింది. ఆ తర్వాత దంపతులిద్దరూ కలిసి మృతదేహాన్ని ఓ గోనె సంచిలో కుక్కి ఇంటి మిద్దె పైన ఉంచారు. మృతదేహం నుంచి దర్వాసన వస్తుండటంతో భర్త సాయంతో దానిని అక్కడి నుంచి తరలించి సమీంలోని ఖాళీ స్థలంలో ఉన్న చెట్ల పొదల్లో పడేసినట్లు నిందితురాలు పోలీసులకు వివరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్