Woman Raped: కొడుకు ముందే మహిళపై అత్యాచారం చేసిన మాంత్రికుడు..

అత్తకోడలి మధ్య తగాదాలు తీరుస్తానని నమ్మబలికి రెండున్నర సంవత్సరాల కొడుకు ముందే ఓ మహిళని అత్యాచారం చేశాడో మాంత్రికుడు.

Published : 07 May 2022 19:05 IST

బాలాసోర్‌(ఒడిశా): అత్తకోడలి మధ్య తగాదాలు తీరుస్తానని నమ్మబలికి రెండున్నర సంవత్సరాల కొడుకు ముందే ఓ మహిళని అత్యాచారం చేశాడో మాంత్రికుడు. 79రోజులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కట్టుకున్న భర్త, అత్తింటి వాళ్లే ఆమెకు మత్తుమందిచ్చి ఆ మాంత్రికుడి దగ్గర వదిలివెళ్లడం గమనార్హం. ఒడిశాలో జరిగిన ఈ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళకు  బాలాసోర్‌కు చెందిన వ్యక్తితో 2017లో వివాహం జరిగింది. కొంతకాలం తర్వాత అత్తకి ఆమెకు మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. దీన్ని అదునుగా తీసుకున్న ఓ మాంత్రికుడు గొడవలు తీరుస్తానని ఆమె భర్తకు నమ్మబలికాడు. ఆమెను కొన్ని నెలలు తన వద్ద వదిలివెళ్లాలని కోరాడు. దీంతో భర్త, అత్తింటి వాళ్లు ఆమెకు మత్తుమందిచ్చి రెండున్నరేళ్ల కొడుకుతో సహా మాంత్రికుడి వద్ద వదిలివెళ్లారు. అతను 79రోజులు ఆమెపై అత్యాచారం చేశాడు.

నిందితుడు ఆమెను, పిల్లాడిని ఒక గదిలో బంధించాడు. రోజు ఆహారం అందించేవాడు. ఏప్రిల్‌28న మాంత్రికుడు తన ఫోన్‌ మర్చిపోయి బయటకు వెళ్లాడు. వెంటనే బాదితురాలు వాళ్ల అమ్మనాన్నలకు ఫోన్‌ చేసి విషయం చెప్పగా వాళ్లు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు రావడం చూసి మాంత్రికుడు పరారయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దొంగ మాంత్రికుడి కోసం గాలింపు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు