Crime news: యువతిపై అత్యాచారం చేసి.. 10వ అంతస్తు నుంచి కిందకు తోసేసి!
మహిళలపై లైంగిక అకృత్యాలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా అతివలపై దారుణాలు మాత్రం ఆగడంలేదు. తాజాగా మరో పాశవిక ఘటన ....
కాన్పూర్: మహిళలపై లైంగిక అకృత్యాలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా అతివలపై దారుణాలు మాత్రం ఆగడంలేదు. తాజాగా మరో పాశవిక ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో చోటుచేసుకుంది. 19ఏళ్ల యువతిని రేప్ చేసి పదో అంతస్తు నుంచి తోసేశాడో మానవమృగం. తన వద్ద ఉద్యోగం చేస్తున్న యువతిని లైంగికంగా లొంగదీసుకొనేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టడంతో ప్రణాళిక ప్రకారం తన ఫ్లాట్కు రప్పించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. తొలుత తమను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించినప్పటికీ.. చివరకు నేరం అంగీకరించాడని పోలీసుల వెల్లడించారు.
ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ప్రతీక్ వైశ్ (40) అనే వ్యక్తి డెయిరీ నిర్వహిస్తున్నాడు. అతడి వద్ద బాధిత యువతి సెక్రటరీగా పనిచేస్తోంది. ఆమెపై కన్నేసిన ప్రతీక్.. మంగళవారం పని ఉందని చెప్పి బాధితురాలిని కల్యాణ్పూర్లోని తన ఫ్లాట్కు తీసుకెళ్లాడు. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడు. డబ్బు ఇస్తానని కూడా ఆశచూపాడు.. అయితే, అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టు డిప్యూటీ పోలీస్ కమిషనర్ బీబీజీటీఎస్ మూర్తి వివరించారు. ఈ దారుణం గురించి పోలీసులకు చెబుతానని ఆమె బెదిరించడంతో నిందితుడు పదో అంతస్తులో తాను ఉంటున్న ఫ్లాట్ బాల్కనీ నుంచి కిందకు తోసేయడంతో మృతిచెందిందని పోలీసులు తెలిపారు. నిందితుడుని బుధవారం అరెస్టు చేసి చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి కస్టడీకి తరలించినట్టు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
-
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
-
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
-
అంటకాగితే.. అంతే రాణా..!