Crime news: చేతులు కట్టేసి.. నోరు బిగించి.. నర్సుపై సామూహిక అత్యాచారం
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఓ నర్సుపై ఘోరం జరిగింది. ఆమె ఒంటరిగా పనిచేసుకొంటుండగా లోపలికి చొరబడిన నలుగురు దుండగులు చేతులు కట్టేసి నోరు బిగించి సామూహిక అత్యాచారానికి తెగడ్డారు.
రాయ్పూర్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఓ నర్సుపై ఘోరం జరిగింది. ఆమె ఒంటరిగా పనిచేసుకొంటుండగా లోపలికి చొరబడిన నలుగురు దుండగులు చేతులు కట్టేసి నోరు బిగించి సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. వీరిలో ఒకరు మైనర్ కావడం గమనార్హం. ఇప్పటివరకు ముగ్గురు నిందితులను అరెస్టు చేయగా.. ఒక నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో మహేంద్రగఢ్ జిల్లాలోని చిప్చిపి గ్రామంలో ఈ దారుణం జరిగింది. ఆరోగ్య కేంద్రంలో ఒంటరిగా పనిచేసుకుంటున్న సమయంలో లోపలికి ప్రవేశించిన దుండగులు ఆమె చేతులు కట్టేసి.. అరుపులు వినబడకుండా గట్టిగా నోరు బిగించి సామూహిక అత్యాచారానికి తెగబడ్డారని ఆరోపిస్తూ మహిళ ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. తనపై లైంగిక దాడిని రికార్డు చేశారని.. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారని ఆమె ఆరోపించారు. తనపై జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు చెప్పిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.
మరోవైపు, ఈ ఘటనను భాజపా ఖండించింది. సీఎం భూపేశ్ బఘేల్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టింది. ఈ నేపథ్యంలో భాజపా నిరసనలపై మనేంద్రగఢ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ జైశ్వాల్ దీటుగా స్పందించారు. ఈ విషయాన్ని భాజపా రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు. మరోవైపు, ఈ ఘటనతో ఆరోగ్య కార్యకర్తలు రిమోట్ గ్రామాల్లో పనిచేసేందుకు భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు. తమకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ‘‘మాకు భద్రత కావాలి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే మేం పనిచేయలేం’’ అని జిల్లా ఆరోగ్య కేంద్రం చీఫ్ హెల్త్ ఆఫీసర్ ప్రతిమా సింగ్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.