Horror incident: బెంగళూరులో భయానక ఘటన.. డ్రమ్ములో మహిళ మృతదేహం

కర్ణాటకలోని బెంగళూరు నగరంలో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. రైల్వేస్టేషన్‌లోని ఓ డ్రమ్ములో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించడం కలకలం రేపుతోంది. 

Published : 04 Jan 2023 20:26 IST

బెంగళూరు: బెంగళూరులో అత్యంత భయానకమైన ఘటన(Bengaluru Horror) వెలుగులోకి వచ్చింది. యశ్వంత్‌పూర్‌ రైల్వేస్టేషన్‌లోని 1వ నంబర్‌ ప్లాట్‌ఫాం వద్ద ఓ డ్రమ్ములో కుళ్లిపోయిన దశలో ఉన్న మహిళ మృతదేహాన్ని గుర్తించడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఉదయం రైల్వే స్టేషన్‌ను శుభ్రంచేసే సిబ్బంది డ్రమ్మును గుర్తించి.. అందులోంచి దుర్వాసన రావడంతో పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో వారు వచ్చి పరిశీలించగా.. కుళ్లిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహం ఉన్నట్టు గుర్తించారని బెంగళూరు డివిజన్‌ అదనపు డీఆర్‌ఎం కుసుమా హరిప్రసాద్‌ తెలిపారు. డ్రమ్ములో మృతదేహంపై బట్టలు కప్పి ఉన్నాయని పోలీసులు తెలిపారు. అయితే, పాలిథీన్‌ కవర్‌లో ఆమె శవాన్ని చుట్టి ఆ తర్వాత డ్రమ్ములో కుక్కినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్‌ నిపుణులు ఆ ప్రాంతంలో ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు. మహిళ వయస్సు 20ఏళ్లకు పైగా ఉంటుందని భావిస్తున్న పోలీసులు.. ఆమెకు సంబంధించిన వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఐదు రోజుల క్రితమే మహిళను చంపి డ్రమ్ములో కుక్కి ఉంటారని అనుమానిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు