Telangana news: డీజే ప్రాణం తీసిందా?.. పెళ్లి ఊరేగింపులో డ్యాన్స్‌ చేస్తూ మహిళ మృతి

ఉత్సాహంగా బంధువు వివాహ ఊరేగింపులో నృత్యం చేస్తూ తీవ్ర అస్వస్థతకు గురైన ఓ మహిళ ఆసుపత్రిలో మృతి చెందిన ఘటన గురువారం అర్ధరాత్రి నగర శివారు అల్లీపురంలో చోటుచేసుకుంది.

Updated : 18 Mar 2023 16:55 IST

ఖమ్మం అర్బన్: ఉత్సాహంగా బంధువు వివాహ ఊరేగింపులో నృత్యం చేస్తూ తీవ్ర అస్వస్థతకు గురైన ఓ మహిళ ఆసుపత్రిలో మృతి చెందిన ఘటన గురువారం అర్ధరాత్రి నగర శివారు అల్లీపురంలో చోటుచేసుకుంది. బంధువుల కథనం ప్రకారం.. స్థానికంగా నివసించే పెనుగూరి రాణి(30) గురువారం చింతకాని మండలం సీతంపేటలో బంధువు వివాహ వేడుకలో కుటుంబంతో కలిసి పాల్గొంది. పెళ్లి కొడుకుతో తిరిగి ఇంటికి వస్తూ అల్లీపురంలో జరిగిన ఊరేగింపులో ఉత్సాహంగా నృత్యం చేసింది. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురై పడిపోయిన ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతి చెందింది. డీజే శబ్ధాల ధాటికి ఆమె బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైనట్లు వైద్యులు తెలిపారని బంధువులు చెప్పారు. రాణి స్వగ్రామం రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం. దివ్యాంగుడైన భర్త ఉప్పలయ్య, కుమార్తెలు అమూల్య, అంజలితో కలిసి తన పుట్టిల్లు అల్లీపురంలో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. రాణి మృతితో కుమార్తెలు ఆదరవు కోల్పోయారని బంధువులు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని