ఇద్దరు పిల్లలతో సహా మహిళ ఆత్మహత్య

పెద్దపల్లి జిల్లా నిమ్మనపల్లిలో విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలతో సహా ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నారు. కుమారుడు(14), కుమార్తె(14 నెలలు)తో కలిసి విజయ బావిలో ..

Published : 21 Apr 2021 09:08 IST

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా నిమ్మనపల్లిలో విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలతో సహా ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నారు. కుమారుడు(14), కుమార్తె(14 నెలలు)తో కలిసి విజయ బావిలో దూకారు. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది మహిళ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బావిలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని