ప్రముఖ చిత్రకారుడు చంద్ర కన్నుమూత 

ప్రముఖ చిత్రకారుడు, రచయిత చంద్ర (74) ఇకలేరు. కరోనా బారిన పడి ఆయన తుదిశ్వాస ...

Updated : 29 Apr 2021 11:53 IST

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి ధాటికి మరో ప్రముఖుడు తుది శ్వాస విడిచారు. ప్రముఖ చిత్రకారుడు, రచయిత చంద్ర (74) కరోనాతో కన్నుమూశారు. గత మూడేళ్లుగా నరాలకు సంబంధించిన చికిత్స తీసుకుంటున్న చంద్రను కరోనా మహమ్మారి బలి తీసుకుంది. సికింద్రాబాద్‌లోని మదర్‌ థెరిసా రీహాబిటేషన్‌ సెంటర్‌లో కరోనాతో చికిత్స పొందుతూ ఆయన నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. చంద్ర పార్థివదేహాన్ని బంజారాహిల్స్‌ శ్రీనగర్‌ కాలనీలోని నివాసానికి తరలించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని