Crime news: వైకాపా నేతల వేధింపులు తట్టుకోలేక దంపతుల ఆత్మహత్యాయత్నం..

వైకాపా నాయకులు, పోలీసులు వేధిస్తున్నారంటూ నంద్యాల జిల్లాలో దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. బనగానపల్లె మండలం ఎర్రగుడికి చెందిన తలారి లక్ష్మీనారాయణ, ఆయన భార్య రాములమ్మ దంపతులను కొంతమంది నాయకుల పేర్లు చెబుతూ గత మూడు...

Updated : 27 Dec 2022 18:21 IST

నంద్యాల: వైకాపా నాయకులు, పోలీసులు వేధిస్తున్నారంటూ నంద్యాల జిల్లాలో దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. బనగానపల్లె మండలం ఎర్రగుడికి చెందిన తలారి లక్ష్మీనారాయణ, ఆయన భార్య రాములమ్మ దంపతులను కొంతమంది నాయకుల పేర్లు చెబుతూ గత మూడు నెలల నుంచి ప్రతి విషయంలోనూ కేసులు పెట్టి వేధిస్తున్నారని, అందుకే ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమయ్యారని కుటుంబ సభ్యలు ఆరోపిస్తున్నారు.  వేధింపులు తట్టుకోలేక పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం గుర్తించి ఇద్దరిని బనగానపల్లె ఆసుపత్రికి తరలించారు. ప్రస్తతుం అక్కడ చికిత్స పొందుతున్నారు. నాటు సారా కాస్తున్నారంటూ తరచూ వేధిస్తున్నారని ఎస్పీకి లేఖ రాసి ఆత్మహత్యాయత్నం చేశారు. గ్రామంలో ఇతరులు నాటు సారా విక్రయించినా తమపైనే కేసులు పెడుతున్నారని వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని