Yo Yo Honey Singh: సింగర్ యోయో హనీ సింగ్పై గృహహింస పిటిషన్
బాలీవుడ్ సింగర్, నటుడు యో యో హనీ సింగ్పై దిల్లీ కోర్టులో గృహహింస పిటిషన్ దాఖలైంది. హనీ సింగ్ తనను లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నట్టు ఆరోపిస్తూ అతడి భార్య శాలిని తల్వార్ దిల్లీలోని తీస్ హజారీ కోర్టులో ‘గృహహింస నిరోధక చట్టం’ కింద మంగళవారం పిటిషన్ దాఖలు చేసింది.
దిల్లీ: బాలీవుడ్ సింగర్, నటుడు యో యో హనీ సింగ్పై దిల్లీ కోర్టులో గృహహింస పిటిషన్ దాఖలైంది. హనీ సింగ్ తనను లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నట్టు ఆరోపిస్తూ అతడి భార్య శాలిని తల్వార్ దిల్లీలోని తీస్ హజారీ కోర్టులో ‘గృహహింస నిరోధక చట్టం’ కింద మంగళవారం పిటిషన్ దాఖలు చేసింది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఆయన తనను మోసం చేసినట్టు అందులో పేర్కొంది. ఆమె తరఫున న్యాయవాదులు సందీప్ కౌర్, అపూర్వ పాండే, జీజీ కశ్యప్ కోర్టుకు హాజరయ్యారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి తానియా సింగ్.. హనీసింగ్కు నోటీసులు జారీ చేశారు. హనీ సింగ్ తనపై వచ్చిన ఆరోపణలకు ఈ నెల 28 లోగా బదులివ్వాల్సిందిగా అందులో పేర్కొన్నారు. తమ ఉమ్మడి ఆస్తులకు సంబంధించి హనీసింగ్ ఎలాంటి లావాదేవీలూ జరపకూడదంటూ శాలిని తల్వార్కు అనుకూలంగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
హనీసింగ్ 2014లో ‘ఇండియాస్ రా స్టార్’ అనే రియాలిటీ షోలో తన భార్య శాలినీ తల్వార్ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. దీపికా పదుకొణె, సైఫ్ అలీఖాన్ నటించిన కాక్టెయిల్ చిత్రంలోని ఓ పాట హనీ సింగ్కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత అతడు ఎన్నో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు పనిచేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రీవెడ్డింగ్ ఫంక్షన్లో వివాదం..యువకుడిని టెర్రస్పై నుంచి తోసేసిన వ్యాపారవేత్త
ఓ ప్రీవెడ్డింగ్ వేడుకలో సరదాగా గడుపుతున్న సమయంలో యువకుల మధ్య జరిగిన చిన్న వివాదం ఓ వ్యక్తికి ప్రాణాంతకంగా మారింది. -
బాలుడిని చంపేసి.. ఆత్మహత్య చేసుకుని..!
చోరీ చేసి.. డబ్బులు పంచుకునే క్రమంలో జరిగిన గొడవలో ఓ యువకుడు బాలుడిని హత్య చేసి, అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
హైదరాబాద్లో అమానుషం.. మహిళపై ఇద్దరు యువకుల అత్యాచారం
చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే ఓ మహిళ.. తెల్లవారుజామున ఇద్దరు యువకుల కంటపడింది. కన్నూమిన్నూ కానకుండా వారు ఆమెపై పాశవికంగా లైంగికదాడికి పాల్పడ్డారు. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ విద్యార్థుల దుర్మరణం
అమెరికాలో శనివారం రాత్రి(భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం) జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు తెలంగాణ విద్యార్థులను బలిగొంది. -
పవన్ సభలో చాకుతో యువకుడు
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ వారాహి విజయభేరి యాత్రలో భాగంగా భీమవరం ప్రకాశం చౌక్లో ప్రసంగిస్తున్న సమయంలో ఇద్దరి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
ట్రక్కును ఢీకొట్టిన కారు.. రాజస్థాన్లో 9 మంది మృతి
పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఓ కారు ట్రక్కును ఢీకొనడంతో తొమ్మిది మంది మరణించారు. రాజస్థాన్లోని ఝలావాఢ్లో ఆదివారం ఈ ప్రమాదం సంభవించింది. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు నేత మృతి
ఛత్తీస్గఢ్లోని బీజాపుర్ జిల్లా కేస్కుతుల్-కేశముండి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆదివారం ఓ మావోయిస్టు నేత మృతి చెందాడు. -
వార్డు సచివాలయంలో పట్టుబడ్డ మద్యం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని వార్డు సచివాలయంలో మద్యం సీసాలు పట్టుబడ్డాయి. -
చంద్రబాబు సభకు వెళ్లారని హత్యాయత్నం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరులో శనివారం జరిగిన చంద్రబాబు బహిరంగ సభకు వెళ్లాడనే అక్కసుతో తెదేపా కార్యకర్తపై వైకాపా మద్దతుదారులు హత్యాయత్నానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
-
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
-
రాష్ట్రంలోని సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను నింపండి: ఏపీ సీఎస్ ఆదేశం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఐపీఎల్ పాయింట్లు పంచి పెడతాం అన్నట్లు ఉంది.. మాజీ క్రికెటర్ సెటైర్
-
విశాఖ - బెంగళూరు మధ్య 20 వేసవి ప్రత్యేక రైళ్లు.. శని, ఆదివారాల్లోనే..!