Crime news: నన్నెందుకు ప్రేమించవ్‌?.. యువతిపై ఘాతుకం

మహారాష్ట్రలో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించలేదన్న కోపంతో యువతిని గొంతు కోసి చంపేశాడు.....

Published : 24 May 2022 01:27 IST

నాసిక్‌: మహారాష్ట్రలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించలేదన్న కోపంతో యువతిని గొంతు కోసి చంపేశాడు. ఈ దారుణం మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో శనివారం చోటుచేకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని నాసిక్‌లోని నిఫడ్‌ తాలుకా లాసల్‌గాన్‌లో అతడి సోదరి ఇంట్లో అరెస్టు చేశారు. ఈ ఘటనపై పోలీసులు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం.. శరణ్‌సింగ్‌ సేథి (20) అనే వ్యక్తి సుఖ్‌ప్రీత్‌ కౌర్‌ (18) అనే యువతిని ఔరంగాబాద్‌ సమీపంలోని దేవగిరి కళాశాల సమీపంలో శనివారం మధ్యాహ్నం గొంతుకోసి చంపాడు. అనంతరం ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. కళాశాలలో బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ చదువుతున్న యువతిని గొంతుకోసి చంపడానికి ముందు ‘నన్ను ఎందుకు ప్రేమించవు?’ అని ఆమెపై అరిచినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఔరంగాబాద్‌లోని వేదాంత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే, ఈ నేపథ్యంలో అక్కడి పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు అప్రమత్తమైన నాసిక్‌ జిల్లా ఎస్పీ సచిన్‌ పాటిల్‌ సారథ్యంలోని బృందం నిందితుడిని అతడి సోదరి ఇంట్లో ఆదివారం అదుపులోకి తీసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని