అడవిలో బాలుడి ఏడుపు విని మృతదేహాల వద్దకు..

నల్లమల అటవీప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. అడవిలో ఇద్దరు  పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తలకొండపల్లి మండలం గట్టుఇప్పలపల్లి  గ్రామానికి చెందిన వివాహిత తన నాలుగేళ్ల కుమారుడితో సహా మరో యువకుడితో కలిసి వెళ్లపోయింది. పదర మండలం ..

Updated : 04 Jul 2021 04:29 IST

నాగర్‌ కర్నూల్‌ : నల్లమల అటవీప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. అడవిలో ఇద్దరు  పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తలకొండపల్లి మండలం గట్టుఇప్పలపల్లి  గ్రామానికి చెందిన వివాహిత తన నాలుగేళ్ల కుమారుడితో సహా మరో యువకుడితో కలిసి వెళ్లపోయింది. పదర మండలం మద్దిమడుగు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఇవాళ సాయంత్రం వివాహిత, యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు పాల్పడే మందు  తల్లిదండ్రులకు ఫోన్‌ చేయడంతో వారు ఘటనాస్థలికి వెళ్లారు. పెద్దలు ఘటనా స్థలికి వెళ్లే వరకు నాలుగేళ్ల బాలుడు భిక్కు భిక్కుమంటూ తల్లి మృతదేహం పక్కనే కూర్చుని ఏడుస్తున్నాడు. బాలుడి ఏడుపు విని పెద్దలు మృతదేహాల వద్దకు చేరుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని